Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పారిశుధ్య కార్మికులకు టీటీడీ గుడ్‌న్యూస్- జీతాల పెంపు

ttdtemple
, సోమవారం, 9 అక్టోబరు 2023 (18:59 IST)
పారిశుధ్య కార్మికులకు టీటీడీ గుడ్‌న్యూస్ చెప్పింది. టీటీడీ పారిశుధ్య కార్మికుల జీతాలను 12 వేల నుంచి 17 వేలకు పెంచుతున్నట్లు భూమన టీటీడీ ఛైర్మన్ కరుణాకర్ రెడ్డి వెల్లడించారు. టీటీడీ కమిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఆయనకు మీడియాకు వివరించారు. 
 
మొత్తం ఐదు వేల మంది పారిశుధ్య కార్మికులకు జీతాల పెంపు వర్తిస్తుందని తెలిపారు. అలిపిరి వద్ద ప్రతి నిత్యం శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమాన్ని నిర్వహిస్తామని చెప్పారు.  
 
టీటీడీ పరిధిలోని కార్పొరేషన్‌లో విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగుల జీతాలను ప్రతి సంవత్సరం 3 శాతం పెంచేలా నిర్ణయించామన్నారు కరుణాకర్ రెడ్డి. కార్పొరేషన్‌లో పని చేసే ఉద్యోగులు అకాల మరణం పోందితే వారికి 2 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లిస్తామని తెలిపారు. 
 
అదేవిధంగా కార్పొరేషన్‌లో పని చేస్తూ ఈఎస్ఐ వర్తించని ఉద్యోగులకు హెల్త్ స్కీమ్ వర్తింపజేస్తామన్నారు. నారాయణగిరి ఉద్యానవనంలో కంపార్టుమెంట్లు ఏర్పాటుకు 18 కోట్లు కేటాయిస్తూ సమావేశంలో నిర్ణయం తీసుకున్నామన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

"ఏపీ నీడ్స్ జగన్".. 52 నెలల కాలం చరిత్రలో.. సీఎం జగన్