Publish Date: Mon, 13 Jan 2020 (23:31 IST)
Updated Date: Mon, 13 Jan 2020 (23:32 IST)
సినీ నటుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత కృష్ణుడు నివాసంలో విషాదం నెలకొంది. ఆయన తండ్రి అల్లూరి సీతారామరాజు సోమవారం నాడు కన్నుమూశారు.
అల్లూరి సీతారామరాజు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. దీంతో భీమవరం ఆస్పత్రిలో ఆయనకి చికిత్స అందిస్తున్నారు. ట్రీట్మెంట్ పొందుతూ సోమవారం ఆయన మరణించారు. ఈ విషయం తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు, పార్టీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
ఇది ఇలా ఉండగా.. నటుడు కృష్ణుడు తెలుగు సినిమాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. 'వినాయకుడు' సినిమాతో హీరోగా మారి కొన్ని చిత్రాల్లో నటించాడు.
హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా ప్రేక్షకులను అలరించిన కృష్ణుడు ఈ మధ్యకాలంలో సినిమాలకు దూరమయ్యాడు. రీసెంట్ గా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.