Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నారా లోకేష్, వంగ‌ల‌పూడి అనిత‌ల‌పై విజ‌య‌వాడ‌లో కేసులు న‌మోదు

Advertiesment
traffic
విజయవాడ , శుక్రవారం, 10 సెప్టెంబరు 2021 (12:29 IST)
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనితల‌పై విజయవాడలో కేసులు నమోదు అయ్యాయి. వారు ట్రాఫిక్‌ అంతరాయం, శాంతి భద్రతలకు విఘాతం కలిగించారంటూ కృష్ణలంక పోలీస్‌స్టేషన్‌లో పోలీసులు కేసు నమోదు చేశారు. ఐపీసీ 34, 186, 269 సెక్షన్ల కింద ఇద్దరిపై కేసు నమోదు అయింది.
 
గుంటూరు జిల్లా న‌ర‌స‌రావుపేట‌లో బాధితురాలి కుటుంబాన్ని ఓదార్చేందుకు టీడీపీ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నిన్న విశ్వ‌ప్ర‌య‌త్నం చేశారు. హైద‌రాబాదు నుంచి విజ‌యవాడ ఎయిర్ పోర్ట్ కి వ‌చ్చిన లోకేష్ ను అక్క‌డే పోలీసులు అడ్డుకున్నారు. న‌ర‌స‌రావుపేట‌కు వెళ్ళేందుకు అనుమ‌తి లేద‌ని ఆరెస్ట్ చేసి, తాడేప‌ల్లిలోని లోకేష్ నివాసానికి త‌ర‌లించారు. ఈ యాత్ర‌లో తాను పాల్గొనేందుకు నిబంధ‌న‌ల‌ను అతిక్ర‌మించి, తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత కూడా ట్రాఫిక్ వ‌ల‌యాన్ని ఛేదించి, న‌ర‌స‌రావుపేట‌కు ప్ర‌యాణం అయినందుకు ఆమె పైనా కేసు పెట్టారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆంధ్ర ప్ర‌దేశ్ కొత్త సీఎస్ గా ఐ.ఎ.ఎస్. అధికారి సమీర్ శర్మ