Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

'పంచాయతీ'పై మరికొద్ది సేపట్లో తీర్పు.. హైకోర్టు ఏం చెబుతుందో?

Advertiesment
'పంచాయతీ'పై మరికొద్ది సేపట్లో తీర్పు.. హైకోర్టు ఏం చెబుతుందో?
, గురువారం, 21 జనవరి 2021 (10:00 IST)
పంచాయతీ ఎన్నికలను నిలిపివేయాలన్న సింగిల్‌ జడ్జి ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఇసి) దాఖలు చేసిన రిట్‌ పిటిషన్‌పై హైకోర్టు మరికొద్ది సేపట్లో తీర్పు వెలువరించనుంది.

ఉదయం 10.30 గంటలకు హైకోర్టు సిజె జస్టిస్‌ ఎకె గోస్వామి, జస్టిస్‌ సి.ప్రవీణ్‌కుమార్‌తో కూడిన ధర్మాసనం తీర్పును ఇవ్వనుంది. ఎస్‌ఇసి పిటిషన్‌పై రెండు రోజులు విచారణ జరిపిన న్యాయస్థానం.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ఎన్నికల కమిషన్‌ వాదనలు వినింది.

అనంతరం ఈ నెల 18న తీర్పు రిజర్వ్‌ చేసిన సంగతి తెలిసిందే. దీంతో పంచాయతీ ఎన్నికలపై నేడు హైకోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందోనని అటు రాజకీయ వర్గాల్లో, ఇటు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌లోనూ తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గంటా శ్రీనివాసరావు కుమార్తె ఇంట్లో భారీ చోరీ.. రూ.10 లక్షలు..?