Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తిరుమల ఘాట్ రోడ్డులో చిరుత పులి సంచారం...

తిరుమల ఘాట్ రోడ్డులో చిరుత పులి సంచారం...
విజ‌య‌వాడ‌ , సోమవారం, 4 అక్టోబరు 2021 (13:00 IST)
క‌లియుగ దైవం శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామి ద‌ర్శ‌నానికి వెళ్ళే భ‌క్తుల‌కు ఇంకా ఇబ్బందులు త‌ప్ప‌డం లేదు. ఘాట్ రోడ్డుల‌ను తిరుమ‌ల తిరుప‌తి దేవస్థానం ఎంత‌గా అభివృద్ధి ప‌రిచినా, మ‌ధ్య‌లో అర‌ణ్యాలు నుంచి వ‌స్తున్న క్రూర‌మృగాలు భ‌క్తుల ద‌ర్శ‌నానికి అవ‌రోధంగా మారుతున్నాయి. తాజాగా తిరుమలలో మొదటి ఘాట్ రోడ్డులో చిరుత పులి సంచారం భ‌క్తుల వెన్నులో చ‌లి ప‌ట్టిస్తోంది.

ఆదివారం అర్థరాత్రి మొదటి ఘాట్ రోడ్డులో వినాయక స్వామి ఆలయం వద్ద సంచరించిన చిరుతను ప‌లువురు ప్ర‌యాణికులు ప్ర‌త్య‌క్షంగా చూశారు. కొంద‌రు త‌మ సెల్ ఫోన్ లో చిరుత పులి దృశ్యాలను బంధించారు. భక్తులు ఇచ్చిన స‌మాచారం మేర‌కు అప్రమత్తం అయి, సైరన్ మోగించి భక్తులను అలర్ట్ చేసిన టీటీడీ సెక్యూరిటీ సిబ్బంది అంద‌రూ జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని సూచించారు. చిరుతను అటవీ ప్రాంతంలోనికి పంపించే ప్రయత్నం చేసిన అటవీ శాఖ సిబ్బంది, కొద్ది రోజులు ఈ మార్గంలో జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని చెపుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలంగాణ సభాపర్వం: ఎన్నిరోజులు పనిచేయాలి..