Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Monday, 28 April 2025
webdunia

రూ.12 కోట్ల ఖరీదైన ఆవు.. దాని ప్రత్యేకత తెలిస్తే షాక్ అవుతారు!

Advertiesment
Buffalo
, ఆదివారం, 18 ఆగస్టు 2019 (10:48 IST)
హిందువులు అత్యంత పవిత్రంగా ఆవును కొలుస్తారు. ప్రతీ రోజు ఆవుకి పూజలు చేసి, గో పంచకాన్ని తీర్థంగా తీసుకుంటారు. అదే గో పంచకంతో ఇళ్ళు శుద్ధి చేసుకుంటారు. దాదాపు హిందువులు అందరూ గోవు పట్ల భక్తి శ్రద్ధలతో ఉంటారు. ఎన్నో పూజా కార్యక్రమాలలో ఆవు పాలు తప్పకుండా భాగంగా ఉంటాయి. గృహ ప్రవేశం మొదలు, ప్రతీ శుభ కార్యక్రమంలో ఆవుని భాగస్వామిగా చేస్తారు. 
 
ఆవు నుంచీ వచ్చే మలాన్ని, మూత్రాన్ని పంట పొలాలకి వాడుతారు. ఈ మధ్య కాలంలో ఒక్క ఆవు మలం, మూత్రం ఒక ఎకరానికి సరిపడేలా ఎరువులని తయారు చేసుకోవచ్చుని తెలియడంతో ఒక్కసారిగా ఆవులకి డిమాండ్ పెరిగిపోయింది. దాంతో గతంలో కంటే ఆవు ఖరీదు ఇప్పుడు ఎక్కువయ్యిపోయింది. 
 
ఆవులలో రకరకాల జాతులు కూడా ఉన్నాయి. మన ఆంధ్రప్రదేశ్‌కి చెందిన దేశవాళి, ఒంగోలు, పుంగనూరు, కపిల, ఇలా రకరకాల ఆవులు వివిధ 20 వేల మొదలు మహా అయితే ఒక లక్ష రూపాయలలో వివిధ రకాల ఖరీదులలో లభ్యం అవుతున్నాయి. 
 
కానీ చిత్తూరు ప్రాంతానికి చెందిన పుంగనూరు జాతికి చెందిన ఒక ఆవు ఖరీదు తేలితే మాత్రం షాక్ అయ్యిపోతారు. ఈ ఆవు పాలు, పెరుగు సమస్థం ఏడుకొండల వెంకన్న ప్రసాదాలలో వాడుతారట. ఈ ఆవు రోజుకి ఎన్ని లీటర్ల పాలు ఇస్తుందో తెలుసా దాదాపు 100 లీటర్లు. ఈ ఆవు ఖరీదు అక్షరాల రూ.12 కోట్ల పైమాటేనట. వింటేనే షాక్ అవుతున్నాం కదా మరి నేరుగా చూస్తే ఏమయ్యిపోతమో. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బీజేపీలో చేరిన మాజీ మంత్రి కపిల్ మిశ్రా