Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మూడు రాజధానులతో విద్వేషాలే.. ఒరిగేదేమీ లేదు.. జేడీ

Lakshminarayana
, గురువారం, 24 నవంబరు 2022 (13:47 IST)
మూడు రాజధానులతో ప్రాంతాల మధ్య విద్వేషాలు తప్ప దీనివల్ల ఒనగూరేది ఏమీ ఉండదని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. ఏపీ సర్కారు పట్టుబడుతున్న మూడు రాజధానుల వల్ల ఎలాంటి ప్రయోజనమూ లేదని జేడీ తేల్చి చెప్పేశారు. 
 
ఇంకా మహారాష్ట్రలా ప్రతి జిల్లాను ఒక రాజధానిగా అభివృద్ధి చేస్తే ప్రాంతాల మధ్య విద్వేషాలకు తావుండదన్నారు. అక్కడ తాను 22 సంవత్సరాలు పనిచేశానని వెల్లడించారు. 
 
ముంబై, ఔరంగాబాద్, నాగ్‌పూర్, నాసిక్, పూణె, థానే చుట్టూ ఎన్నో పరిశ్రమలు వచ్చాయని, ఉద్యోగాలు పెరిగాయని జేడీ అన్నారు. అక్కడి ప్రజలు ఉద్యోగాల కోసం బయటి రాష్ట్రాలకు వెళ్లారని తెలిపారు. నాగ్‌పూర్‌లో శీతాకాల సమావేశాలు జరుగుతున్నట్టే ఏపీలోనూ విశాఖ, కర్నూలులో శీతాకాల సమావేశాలు పెట్టుకోవచ్చన్నారు.
 
ఏపీలోనూ ప్రతి జిల్లాను ఇలాగే తీర్చిదిద్దితే మనం ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం వుండదని తెలిపారు. మహారాష్ట్ర తరహాలో అమరావతిలో హైకోర్టు ప్రిన్సిపల్ బెంచ్ పెట్టి విశాఖ, కర్నూలులో బెంచ్‌లు ఏర్పాటు చేస్తే ఆయా ప్రాంతాల్లోని న్యాయపరమైన సమస్యలను అక్కడే పరిష్కరించుకునే వీలుంటుందన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వివాహం జరిగిన 25 రోజులకే భార్య హత్య.. శవాన్ని సంచిలో కుక్కి...