Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కరోనా నేపథ్యంలో 'ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ' పాత్ర అత్యంత కీలకం : మంత్రి మేకపాటి

కరోనా నేపథ్యంలో 'ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ' పాత్ర అత్యంత కీలకం : మంత్రి మేకపాటి
, శనివారం, 25 జులై 2020 (10:10 IST)
ఇండస్ట్రియల్ పాలసీతో పాటే ఐ.టీ పాలసీనీ  త్వరలో ప్రకటించేలా సమాయత్తమవ్వాలని మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వెల్లడించారు.  వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అధ్యక్షతన ఐ.టీ శాఖపై సమీక్ష నిర్వహించారు. ఐ.టీ రంగంలో భారీ పెట్టుబడుల ఆకర్షణపైనే దృష్టి సారించాలని మంత్రి మేకపాటి స్పష్టం చేశారు. ఐ.టీ పాలసీపై తుది కసరత్తు పూర్తిలో వేగం పెంచాలని మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఆదేశించారు.
 
రాష్ట్రంలో ఐ.టీ ఉద్యోగులకు 'వర్క్ ఫ్రమ్ హోమ్' భరోసా
కరోనా ఉద్ధృతి నేపథ్యంలో రాష్ట్రంలోని ఐ.టీ ఉద్యోగులకు 'వర్క్ ఫ్రమ్ హోమ్'కు ఎలాంటి ఆటంకం రాకుండా అన్ని విధాల సన్నద్ధమవ్వాలని  మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఆదేశించారు. ఇంటర్నెట్ కనెక్టిటివిటీ సమస్య రాకుండా మందస్తు చర్యలు చేపట్టాలని మంత్రి సూచించారు.

కోవిడ్-19 విజృంభణ తరుణంలో ఎప్పటికప్పుడు అవసరమైన మార్పులు, టెక్నాలజీ వినియోగంపై దృష్టి కేంద్రీకరించాలన్నారు. ఐ.టీ బడ్జెట్ , వినియోగంపై తదితర శాఖపరమైన ఆర్థిక అంశాలపై మంత్రి మేకపాటి ఆరా తీశారు.
 
నిరుద్యోగులకు ఉపాధి కల్పనకై ఆన్ లైన్ ప్లాట్ ఫామ్
వివిధ రంగాలలో నిరుద్యోగులకు ఉపాధి కల్పనే లక్ష్యంగా అన్ని రంగాలలో ఉపాధి కల్పనకు సంబంధించిన డిజిటల్ ఎంప్లాయ్ మెంట్ ఎక్సేంఛ్ పై మంత్రి చర్చ జరిపారు. విద్య, అర్హతలు, అవకాశాలు తెలుసుకుని ఉద్యోగ ప్రయత్నాలు సాగించే ఒక ప్లాట్ ఫామ్ రూపొందించాలని మంత్రి ఆదేశించారు. ఐ.టీ నైపుణ్యంలో భాగంగా హై-ఎండ్ స్కిల్ యూనివర్శిటీ, ఇంటర్నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ డిజిటల్ టెక్నాలజీస్ గురించి చర్చించారు.
 
పరిపాలన సౌలభ్యం కోసం విభాగాలన్నీ ఒక గొడుకు కిందకు 
పరిపాలన సౌలభ్యం కోసం ఆంధ్రప్రదేశ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అకాడమీ, ఆంధ్రప్రదేశ్ స్పేస్ అప్లికేషన్ సెంటర్, సొసైటీ ఫర్ ఆంధ్రప్రదేశ్ నెట్ వర్క్స్ లను ఒక తాటిపైకి తీసుకురావడంపైనా కార్యదర్శి భాను ప్రకాశ్, సలహాదారులతో మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి చర్చించారు.

అపిట, ఏపీసాక్,సాప్ నెట్ లను ఆంధ్రప్రదేశ్ ఫైబర్ నెట్ లిమిటెట్ కిందకు తీసుకురావడంపై మంత్రి గౌతమ్ రెడ్డి .. ఉన్నతాధికారులతో సమాలోచనలు జరిపారు. శిక్షణ, సంస్థాగత నిర్మాణాలపై అధ్యయనం, ఆర్థిక సర్దుబాటు, పెట్టుబడుల ఆకర్షణ అంశాలలో వినియోగించుకునే పద్ధతిపై చర్చించారు.
 
'మీ-సేవ' ప్రక్రియను పూర్తి చేయాలని మంత్రి గౌతమ్ రెడ్డి ఆదేశం
 'మీ-సేవ' టెక్నికల్ గా  గ్రామసచివాలయాల (పంచాయతీరాజ్ శాఖ) పరిధిలోకి తీసుకువెళ్లడంపై ఐ.టీ శాఖ ఉన్నతాధికారులకు మంత్రి మేకపాటి పలు కీలక సూచనలిచ్చారు. 'మీ- సేవ'లను పంచాయతీ రాజ్ శాఖకు అప్పగిస్తూ జీవో వచ్చినా ఇంకా సాంకేతిక కారణాల దృష్ట్యా ఆ విభాగం ఐ.టీ పరిధిలోనే ఉందని స్పెషల్  సెక్రటరీ సుందర్ మంత్రికి వివరించారు. అందుకు సమాధానంగా మంత్రి మేకపాటి మాట్లాడుతూ జీఏడీ దృష్టికి తీసుకువెళ్లి 'మీ-సేవ' ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలన్నారు.
 
ఐ.టీ శాఖపై జరిగిన వీడియో కాన్ఫరెన్స్ సమీక్షకు  ఐ.టీ శాఖ కార్యదర్శి యేటూరు భాను ప్రకాశ్, ప్రత్యేక కార్యదర్శి బి.సుందర్, ఐ.టీ సలహాదారులు లోకేశ్వర్ రెడ్డి, విద్యాసాగర్ రెడ్డి(టెక్నికల్),దేవిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి (టెక్నికల్), ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్ ఎండీ నందకిశోర్ తదితరులు హాజరయ్యారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇక తెలంగాణాలో కేటీఆర్ అంబులెన్సులు!!