Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తిరుమలలో తెలంగాణ మంత్రి పోచారంకు తీవ్ర అస్వస్థత

తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చిన తెలంగాణ రాష్ట్ర మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి బుధవారం తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. దీంతో ఆయనను అశ్విని ఆస్పత్రికి టిటిడి సిబ్బంది తరిలించి ప్రాథమిక చికిత్స అందిస్తున

తిరుమలలో తెలంగాణ మంత్రి పోచారంకు తీవ్ర అస్వస్థత
, బుధవారం, 22 ఫిబ్రవరి 2017 (10:28 IST)
తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చిన తెలంగాణ రాష్ట్ర మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి బుధవారం తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. దీంతో ఆయనను అశ్విని ఆస్పత్రికి టిటిడి సిబ్బంది తరిలించి ప్రాథమిక చికిత్స అందిస్తున్నారు. 
 
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం శ్రీవారిని దర్శించుకున్నారు. కేసీఆర్ వెంట కుటుంబ సభ్యులతో పాటు ఆ రాష్ట్ర మంత్రులు వచ్చారు. వీరంతా బుధవారం ఉదయం శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం అతిథిగృహానికి చేరుకున్న ఆయనకు ఛాతిలో నొప్పి వచ్చింది. వెంటనే ఆయన్ను స్థానిక అశ్వని వైద్యశాలకు తరలించారు.
 
కొండపైనే ఉన్న అపోలో వైద్యుల బృందం వెంటనే అక్కడకు చేరుకొని ఆయన్ను పరీక్షించి వైద్యసేవలు అందిస్తోంది. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. పోచారానికి అందిస్తున్న వైద్యసేవలను జేఈవో శ్రీనివాసరాజు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. లోబీపీ కారణంగానే ఆయన అస్వస్థతకు గురైనట్టు సమాచారం. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జమ్మూ కాశ్మీర్‌లో పెళ్లి.. 500 మందినే పిలవాలి.. స్వీట్స్, డ్రైఫ్రూట్స్ ఇస్తే?