Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జమ్మూ కాశ్మీర్‌లో పెళ్లి.. 500 మందినే పిలవాలి.. స్వీట్స్, డ్రైఫ్రూట్స్ ఇస్తే?

పెళ్ళిని వైభవంగా అట్టహాసంగా.. గుర్తుండిపోయేలా చేయాలని అందరూ అనుకుంటారు. అయితే జమ్మూ కాశ్మీర్‌లో మాత్రం పెళ్ళిళ్లకు వచ్చే వారిపై ఆంక్షలు విధించారు. జమ్మూ రాష్ట్రంలో జరిగే పెళ్లిళ్లకు అతిథులను ఆహ్వానించ

జమ్మూ కాశ్మీర్‌లో పెళ్లి.. 500 మందినే పిలవాలి.. స్వీట్స్, డ్రైఫ్రూట్స్ ఇస్తే?
, బుధవారం, 22 ఫిబ్రవరి 2017 (10:12 IST)
పెళ్ళిని వైభవంగా అట్టహాసంగా.. గుర్తుండిపోయేలా చేయాలని అందరూ అనుకుంటారు. అయితే జమ్మూ కాశ్మీర్‌లో మాత్రం పెళ్ళిళ్లకు వచ్చే వారిపై ఆంక్షలు విధించారు. జమ్మూ రాష్ట్రంలో జరిగే పెళ్లిళ్లకు అతిథులను ఆహ్వానించడంపై ఆ రాష్ట్ర సర్కారు పరిమితి విధించింది. ఈ నిబంధనలు ఏప్రిల్‌ 1 నుంచి అమలులోకి వస్తాయని తెలిపింది.

పెళ్లిళ్ల ఖర్చుకు సంబంధించి లోక్‌సభలో ఇదే తరహా బిల్లు ప్రవేశపెట్టనున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో కాశ్మీర్‌ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం గమనార్హం. అమ్మాయి పెళ్లిచేసేవారు గరిష్ఠంగా 500 మందిని, అబ్బాయి పెళ్లి చేసేవారు 400 మందినే ఆహ్వానించాలని పేర్కొంది. 
 
ఇక నిశ్చితార్థం వంటి చిన్నపాటి శుభకార్యాలను 100 మంది అతిథుల సమక్షంలో మాత్రమే జరుపుకోవాలని సూచించింది. అంతేకాదు.. లౌడ్‌స్పీకర్లు ఉపయోగించడంపై, బాణసంచా కాల్చడంపై, ఆహ్వాన పత్రికతో స్వీట్లు, డ్రైఫ్రూట్స్‌ వంటివి అందించడంపై నిషేధం విధించింది. రాష్ట్రంలోని వనరులు భారీ పెళ్లిళ్ల పేరిట దుర్వినియోగం కాకుండా చూసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శ్రీవారి దర్శనంలో కేసీఆర్ ఫ్యామిలీ.. రెండు రాష్ట్రాల సంబంధాలు గొప్పగా ఉంటాయి