Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పడకసుఖం ఇవ్వలేదనీ వివాహితపై కిరోసిన్ పోసి నిప్పంటించిన ప్రియుడు

Advertiesment
Telangana
, గురువారం, 28 మార్చి 2019 (09:23 IST)
తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లాలో వివాహేతర హత్య జరిగింది. అక్రమసంబంధం పెట్టుకుని తనకు కొంతకాలం పడకసుఖం ఇచ్చిన వివాహిత.. ఇపుడు ఉన్నట్టుండి మాట్లాడకపోవడంతో కోపం పెంచుకున్న యువకుడు.. ఆమెను హత్య చేశాడు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, రంగారెడ్డి జిల్లా ఫరూఖ్‌నగర్‌ మండల పరిధిలోని మహల్‌ ఎలికట్ట గ్రామానికి చెందిన జంగం రాములుకు అదే గ్రామానికి చెందిన వివాహిత మహిళతో అక్రమ సంబంధం ఏర్పడింది. దీంతో వీరిద్దరూ గత కొంతకాలంగా ఎంజాయ్ చేస్తూ వచ్చారు. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తాయి. ఫలితంగా కొంతకాలంగా వీరిద్దరి మధ్య మాటలులేవు. 
 
పైగా, తనతో మాట్లాడకపోగా, పడక సుఖం దక్కకపోవడంతో ఆగ్రహం హెంచుకున్న రాములు... ఆమెను ఎలాగైనా అంతమొందించాలని పన్నాగంపన్నాడు. మంగళవారం సాయంత్రం కూలీ పనులు చేసి ఇంటికి ఒంటిరిగా వెళ్తున్న మంగమ్మను రాములు వెంబడించి, పథకం ప్రకారం ముందుగానే తన వెంట తెచ్చుకున్న  కిరోసిన్‌ను ఆమె ఒంటిపై పోసి నిప్పంటించి పరారయ్యాడు. 
 
ఈ మంటలకు తాళలేక మంగమ్మ కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకున్నారు. మంటలు ఆర్పి ఆమెను వెంటనే షాద్‌నగర్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మంగమ్మను హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ కన్నుమూసింది. ఈమె చనిపోయే ముందు తన ప్రియుడు గురించి వాంగ్మూలం ఇవ్వగా, దాన్ని జడ్జి నమోదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి పరారీలో ఉన్న జంగం రాములు కోసం గాలిస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బెలూన్లు కొనేందుకు వెళ్లిన మతిస్థిమితం లేని యువతిపై గ్యాంగ్ రేప్