Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జడ్చర్లలో టెన్త్‌ విద్యార్థిని దారుణ హత్య

జడ్చర్లలో టెన్త్‌ విద్యార్థిని దారుణ హత్య
, గురువారం, 29 ఆగస్టు 2019 (12:15 IST)
తెలంగాణ రాష్ట్రంలోని జడ్చర్లలో టెన్త్‌ విద్యార్థిని దారుణ హత్యకు గురైంది. ఫేస్‌బుక్‌ పరిచయమే హత్యకు దారితీసి ఉండొచ్చని సమాచారం. ఈ అమ్మాయిని నవీన్ రెడ్డి అనే యువకుడు ఫేస్‌బుక్ ద్వారా పరిచయం చేసుకున్నాడు. ఆమె ఫోన్ నెంబర్ కూడా తీసుకుని రెండుసార్లు కలిసాడు.
 
ఈ నేపథ్యంలో అమ్మాయి రెండు రోజుల క్రితం అదృశ్యమైంది. దీంతో విద్యార్థిని తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. గురువారం ఉదయం జడ్చర్ల మండలం శంకరాయపల్లి దగ్గర విద్యార్థిని మృతదేహం లభ్యమైంది. పోస్టుమార్టం నిమిత్తం మృత దేహాన్ని స్థానిక ప్రభుత్వ అస్పత్రికి తరలించిన పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కూలీ డబ్బుల కోసం తమ్ముడి హత్య...