Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పెద్దాయ‌న్ని ఏడిపిస్తారా? టీడీపీ ఎంపీల ఫైర్; వైసీపీకి బుద్ధి చెప్పాలి

పెద్దాయ‌న్ని ఏడిపిస్తారా? టీడీపీ ఎంపీల ఫైర్;  వైసీపీకి బుద్ధి చెప్పాలి
విజ‌య‌వాడ‌ , శుక్రవారం, 19 నవంబరు 2021 (19:00 IST)
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, ఆయ‌న భార్యపై అసభ్యకర  పదజాలంతో మాట్లాడంపై తెలుగుదేశం పార్టీ ఎంపీలు గల్లా జయదేవ్, కనకమేడల రవీంద్ర కుమార్, కేశినేని నాని, కింజరాపు రాంమ్మోహన్ నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.


వైసీపీ అరాచక పాలన సాగిస్తున్న వైసిపికి చరమగీతం పాడాలని, అధినేత చంద్రబాబును, ఆయన సతీమణి భువనేశ్వరిని దారుణంగా టార్గెట్ చేస్తున్న వైసిపి ఎమ్మెల్యేలు మంత్రులకు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఏపీ అసెంబ్లీ కౌరవ సభను తలపించేలా ఉందని తెదేపా ఎంపీలు అన్నారు. కొడాలి నాని, అంబటి రాంబాబులను వారించకుండా ముఖ్యమంత్రి సమర్ధించడం చూస్తే, ముఖ్యమంత్రిలో ఉన్న క్రూరత్వం అర్థమవుతోందన్నారు.


ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడుతో కన్నీరు పెట్టించడం ఎంతవరకు సమంజసం అని తెదేపా ఎంపీలు ప్ర‌శ్నించారు. సభ్యత సంస్కారం అంటూ, రాష్ట్ర పతి దగ్గర వైసీపీ నాయకులు నీతులు వల్లించార‌ని, చట్ట సభలో సంస్కారం లేని మాటలడే వారిపై ఏం సమాధానం చెప్తార‌ని నిల‌దీశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చంద్ర‌బాబు ఎందుకు ఏడ్చాడో చెప్పాలి... ఎమ్మెల్యే అంబటి రాంబాబు