Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మోడీగారు.. మీకు మూడిందా? : కోయదొర వేషంలో ఎంపీ శివప్రసాద్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి న్యాయం చేయాలని, ప్రత్యేక హోదాను కేటాయించాలని కోరుతూ పార్లమెంట్ వేదికగా టీడీపీ ఎంపీలు గతవారం రోజులుగా వివిధ రకాలుగా ఆందోళనలు చేస్తున్నారు. ముఖ్యంగా, చిత్తూరు ఎంపీ డాక్టర్ ఎన్.

Advertiesment
Siva Prasad
, శుక్రవారం, 9 మార్చి 2018 (13:15 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి న్యాయం చేయాలని, ప్రత్యేక హోదాను కేటాయించాలని కోరుతూ పార్లమెంట్ వేదికగా టీడీపీ ఎంపీలు గతవారం రోజులుగా వివిధ రకాలుగా ఆందోళనలు చేస్తున్నారు. ముఖ్యంగా, చిత్తూరు ఎంపీ డాక్టర్ ఎన్. శివప్రసాద్ రోజుకో వేషంలో పార్లమెంట్‌కు వచ్చి తన నిరసనను తెలుపుతున్నారు.
 
ఇందులోభాగంగా, ఆయన శుక్రవారం కోయదొర వేషంలో పార్లమెంట్‌కు వచ్చారు. కొండదేవర తరహాలో మాట్లాడుతూ, పార్లమెంటులో కలియదిరిగారు. మధ్యలో, కేంద్ర మాజీ మంత్రి జైరాం రమేష్ చేయి చూసి జాతకం కూడా చెప్పారు.
 
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. 'బెజవాడ కనకదుర్గమ్మ మీద ఆన... తిరుపతి ఎంకన్న మీద ఆన.. జరిగింది చెబుతాను.. జరగబోయేది చెబుతాను.. ఆ నాడు ఇందిరకు చెప్పాను.. ఎన్టీఆర్‌తో పెట్టుకోవద్దని.. పెట్టుకుంటే ఏం జరిగిందో తెలుసు కదా.
 
ఈనాడు మోడీకి చెబుతున్నాను... ఏపీతో సఖ్యంగా ఉండటం ఇష్టం లేదా.. మీకు మూడిందా ఏంది... తెలుగు ప్రజల ఆత్మగౌరవ నాడి తెలియలేదా ఏంది.. ఇచ్చిన హామీలు ఎందుకు నెరవేర్చలేదు నీవు.. ఏపీని ఏం చేయాలనుకుంటున్నావు నీవు' అంటూ కోయదొర మాదిరి మాట్లాడారు. మా మాట వింటే హుర్రో హుర్రు.. లేకపోతే పుర్రో పుర్రు అంటూ వ్యాఖ్యానించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వెంకయ్యగారు... మీరూ రాజీనామా చేయండి : పెరుగుతున్న ఒత్తిడి.. దిక్కుతోచని బీజేపీ