Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మీ అమ్మ... నీవు కలిసి మమ్మల్ని ముంచారు... నీ మాటలు నమ్మే నా కొడుకు ఎవరయ్యా : జేసీ ప్రభాకర్ రెడ్డి

వచ్చే 2019లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చేసిన హామీపై టీడీపీకి చెందిన అనతంపురం ఎంపీ జేసీ

Advertiesment
JC Diwakar Reddy
, బుధవారం, 7 మార్చి 2018 (10:48 IST)
వచ్చే 2019లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చేసిన హామీపై టీడీపీకి చెందిన అనతంపురం ఎంపీ జేసీ ప్రభాకర్ రెడ్డి మండిపడ్డారు. 
 
ఆయన బుధవారం ఢిల్లీలోని పార్లమెంట్ ఆవరణలో మీడియాతో మాట్లాడుతూ, మీ అమ్మ సోనియా, నీవు కలిసి మమ్మల్ని నిలువునా ముంచారు. కట్టుబట్టలతో నడి రోడ్డుపైకి తెచ్చారు. ఇపుడు అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా ఇస్తామంటూ హామీలు ఇస్తున్నావ్.. ఆ రోజు మీరు పార్లమెంట్ తలుపులు మూసి చేసిన పనికి దక్కిన ఫలితమే ఇది. ఇపుడు నీ మాటలు నమ్మే నాకొడుకు ఎవరయ్యా అంటూ జేసీ దివాకర్ రెడ్డి ఆగ్రహంతో అన్నారు. 
 
అంతేకాకుండా, వచ్చే ఎన్నికల్లో కాదు కదా.. మరో 20 యేళ్ల పాటు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదని ఆయన జోస్యం చెప్పారు. అలాగే, తమ సహనానికి కూడా ఓ హద్దు ఉంటుందన్నారు. కేంద్ర మంత్రులు రాజీనామాలు ఏ క్షణమైనా జరగొచ్చని జేసీ దివాకర్ రెడ్డి ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పెషావర్ యువకులకు షాక్.. హెయిర్ కట్‌లో ఇక నో-స్టైల్