Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఎయిడెడ్ పోరుతో విజయవాడలో ఉద్రిక్తత

Advertiesment
ఎయిడెడ్ పోరుతో విజయవాడలో ఉద్రిక్తత
, గురువారం, 11 నవంబరు 2021 (20:35 IST)
రాష్ట్ర వ్యాప్తంగా ఎయిడెడ్ విద్యాసంస్థలను కొనసాగించాలనే ఆందోళనలు హోరెత్తుతున్నాయి. విజయవాడ వన్ టౌన్‌లో ఉన్న ఎస్.కె.పి.వి.వి హిందూ హైస్కూల్‌ని ఎయిడెడ్ లోనే కొనసాగించాలని ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు ధర్నా నిర్వహించారు. ఈ నేపధ్యంలో ఎస్ఎఫ్ఐ నాయకులు మరియు విద్యార్థులు, పూర్వ విద్యార్థులు హిందూ హైస్కూల్ యాజమాన్యంను వైఖరి ప్రకటించాలని కోరారు.
 
ఎంతసేపటికీ బయటికి రాకపోవడంతో స్కూల్ లోపలికి వెళ్లే ప్రయత్నం చేసారు. పరిస్థితి అదుపుకాకపోవడంతో ఎస్ఎఫ్ఐ నాయకులను పోలీసులు అరెస్టు చేసారు. ఈ క్రమంలో అక్కడ ఉద్రిక్తతత నెలకొంది. 
 
సుమారు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు సాగిన ధర్నా కార్యక్రమం కొనసాగింది. చివరికి ఎయిడెడ్ స్కూల్‌ని ఎయిడెడ్ లోనే కొనసాగిస్తామని ప్రభుత్వానికి స్కూల్ యాజమాన్యం విల్లింగ్ లెటర్ చూపించడంతో విద్యార్థులు ధర్నా విరమించుకున్నారు. ఎయిడెడ్ విద్యాసంస్థలను విలీనానికి సంబంధించిన జీవో రద్దు చేసేంతవరకు ఎస్ఎఫ్ఐ పోరాడుతూనే ఉంటుందని హెచ్చరించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దేవేంద్ర ఫ‌డ్న‌వీస్‌పై రూ. 5 కోట్ల ప‌రువు న‌ష్టం దావా..