Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

గ‌రుడ వాహ‌నంపై శ్రీ ప్ర‌స‌న్న‌ వేంకటేశ్వరస్వామి

గ‌రుడ వాహ‌నంపై శ్రీ ప్ర‌స‌న్న‌ వేంకటేశ్వరస్వామి
, బుధవారం, 23 జూన్ 2021 (22:41 IST)
అప్పలాయగుంట శ్రీ ప్ర‌స‌న్న‌వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో రోజైన బుధ‌వారం సాయంత్రం విశేషమైన గరుడ వాహనసేవ జరిగింది. కోవిడ్ - 19 వ్యాప్తి నేప‌థ్యంలో ఆల‌యంలో ఏకాంతంగా వాహ‌న‌సేవ నిర్వ‌హించారు.

స్వామివారి బ్రహ్మోత్సవాలలో గరుడ వాహనోత్సవం అతి ముఖ్యమైనది. వేదాలు, ఆచార్యులు గరుడుడిని వేదస్వరూపుడిగా పేర్కొన్నారు. గరుడుని సేవాదృక్పథం, మాతృభక్తి, ప్రభుభక్తి, సత్యనిష్ఠ, నిష్కళంకత, ఉపకారగుణం సమాజానికి స్ఫూర్తిదాయకాలు. గరుడ వాహనంపై ఉన్న స్వామివారిని దర్శిస్తే మోక్షం సిద్ధిస్తుంద‌ని భక్తుల నమ్మకం.

అందుకే గరుడసేవకు ఎనలేని  విశిష్టత ఏర్పడింది.ఈ కార్య‌క్ర‌మంలో టీటీడీ ఎఫ్ ఏ అండ్ సి ఏవో బాలాజి ఆల‌య డెప్యూటీ ఈవో  క‌స్తూరి బాయి, ఏఈవో ప్ర‌భాక‌ర్ రెడ్డి,ఆల‌య ప్ర‌ధాన అర్చ‌కులు మ‌రియు కంక‌ణ‌బ‌ట్టార్ సూర్య‌కుమార్ ఆచార్యులు, సూప‌రింటెండెంట్ గోపాల కృష్ణ‌రెడ్డి, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్ శ్రీ శ్రీ‌నివాసులు పాల్గొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సాల్ట్ ప్రాజెక్టుకు రూ.1,860 కోట్ల ప్రపంచ బ్యాంకు ఆర్థిక సహాయం: మంత్రి ఆదిమూలపు సురేష్