Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వదినను తిట్టిన తండ్రి.... ఆగ్రహంతో చంపేసిన కొడుకు...

వదినను తిట్టిన తండ్రి.... ఆగ్రహంతో చంపేసిన కొడుకు...
, సోమవారం, 27 మే 2019 (20:31 IST)
క్షణికావేశంలో కొంతమంది ఏం చేస్తారో వారికే తెలియదు. కట్టుకున్న భార్య అయినా, కన్న తండ్రి అయినా సరే ఆవేశంలో హత్యలు చేసేస్తుంటారు. అలాంటి సంఘటనే చిత్తూరు జిల్లా వి.కోట మండలంలో జరిగింది. తన వదినను కొట్టాడన్న కోపంతో ఆగ్రహంతో ఊగిపోయిన కొడుకు తన తండ్రిని గోడకేసి బాది అతి దారుణంగా చంపేశాడు. 
 
వి.కోట మండల పరిధిలోని పాముగాని పల్లె పంచాయతీ కొత్తచిన్నేపల్లి గ్రామానికి చెందిన సల్లా పూరెప్పకు ముగ్గురు సంతానం. రెండో కుమారుడు అంజప్ప సంరక్షణలో ఉంటున్నాడు. చిన్న కుమారుడు వెంకటరమణ జెసిబి డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఇటీవల ఇంటికి వచ్చాడు. అంజప్ప భార్య షబానా ఇంట్లో మటన్ కర్రీ చేసింది. సల్లా వూరెప్ప తనకు మాంసం కూర పెట్టలేదని కోడలు షబానాతో గొడవపడ్డాడు. తాగిన మైకంలో ఉన్న వెంకటరమణ వదిననే తిడతావా అంటూ తండ్రి సల్లాపూరెడ్డిని గోడకేసి కొట్టి హతమార్చాడు. 
 
గుట్టుచప్పుడు కాకుండా అంత్యక్రియలకు ఏర్పాట్లు చేసుకుంటుంటే అసలు విషయం బయటపడింది. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. గ్రామస్తుల ఫిర్యాదుతోనే పోలీసులు కేసు నమోదు చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

లడ్డూ అయితే ఇచ్చేశారు కానీ రోజా భయంతో వణికిపోతున్నారట... అందుకే జగన్ చుట్టూ...