Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మల్లన్న ఆలయంలో 1800-1910 నాటి వెండి నాణేలు

మల్లన్న ఆలయంలో 1800-1910 నాటి వెండి నాణేలు
, గురువారం, 17 సెప్టెంబరు 2020 (06:01 IST)
శ్రీశైలంలోని మల్లన్న ప్రధానాలయానికి ఎదురుగా ఉన్న ఉపాలయ గోడల రాళ్ల మధ్య 245 వెండి నాణేలు, ఒక రాగి నాణెం, 3 తామ్ర శాసనాలు లభించాయి.

ఆలయ ఈవో కేఎస్‌.రామారావు మాట్లాడుతూ.. ఈ రాగి రేకులపై నాగరి, కన్నడ లిపితో చెక్కిన శాసనాలు ఉన్నాయన్నారు. శివలింగం, నంది చిత్రీకరించిన రాగి రేకుపై ఒక రాజు శివలింగానికి నమస్కరిస్తున్నట్లుగా ఉందని, మరో రేకుపై గోవును కూడా చిత్రీకరించారని చెప్పారు.

97 వెండి నాణేలు విడిగా లభించాయని, 148 నాణేలు ఇత్తడి పాత్రలో ఉన్నాయని తెలిపారు. ఇవి 1800-1910 మధ్య తయారైనవిగా భావిస్తున్నట్లు చెప్పారు.

వీటి పరిశీలనకు శ్రీశైలంలోని పొట్టిశ్రీరాములు తెలుగు వర్సిటీ అధ్యయన కేంద్రం సంస్కతి, పురావస్తు విభాగం ఆచార్యులను పిలిపించామని, పురావస్తు కార్యాలయానికి కూడా సమాచారమిచ్చామని చెప్పారు. కాగా ఇదే ప్రాంతంలో ఈ నెల 7, 8 తేదీలలో 29 తామ్ర శాసనాలు లభించాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మలేషియా: పోగొట్టుకున్న సెల్ ఫోన్‌లో 'దొరికిన' కోతుల సెల్ఫీలు