Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నిమ్మగడ్డకు షాక్: ఎస్‌ఈసీ తెచ్చిన E-watch కి హైకోర్టు బ్రేక్‌

నిమ్మగడ్డకు షాక్: ఎస్‌ఈసీ తెచ్చిన E-watch కి హైకోర్టు బ్రేక్‌
, శుక్రవారం, 5 ఫిబ్రవరి 2021 (17:11 IST)
అమరావతి: రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు హైకోర్టులో చుక్కెదురైంది. ఎస్‌ఈసీ తయారు చేసిన యాప్‌నకు ఏపీ టెక్నాలజీ సర్వీసెస్‌ నుంచి సెక్యూరిటీ సర్టిఫికేషన్ వచ్చేంతవరకు నిలిపివేయాలని న్యాయస్థాన ఆదేశించింది. తదుపరి విచారణను ఈనెల 9వ తేదీకి వాయిదా వేసింది.
 
కాగా పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఈ- వాచ్‌ పేరుతో ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ ఓ యాప్‌ను విడుదల చేశారు. దీని ద్వారా ఫిర్యాదులు స్వీకరిస్తామని తెలిపారు. అయితే ప్రైవేటు యాప్‌పై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది.
 
దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. ఈ- వాచ్‌కు సెక్యూరిటీ సర్టిఫికెట్‌ ఉందా అని ఎస్‌ఈసీ తరఫు న్యాయవాదిని ప్రశ్నించగా, 5 రోజుల్లో తీసుకువస్తామని సమాధానమిచ్చారు. ఈ నేపథ్యంలో అప్పటి వరకు ఈ యాప్‌ను ఉపయోగించవద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పాత విధానంలో హెచ్1బి వీసాల జారీ : బైడెన్ సర్కారు నిర్ణయం