Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

'దివానోస్ పేకాట క్లబ్' పేరుతో హీరో మహేష్ బాబు చెల్లికి శిల్పా చౌదరి టోకరా

'దివానోస్ పేకాట క్లబ్' పేరుతో హీరో మహేష్ బాబు చెల్లికి శిల్పా చౌదరి టోకరా
, గురువారం, 2 డిశెంబరు 2021 (08:59 IST)
కిలేడీ శిల్పా చౌదరి లీలలు రోజుకొకటి చొప్పున వెలుగు చూస్తున్నాయి. పలువురు సెలెబ్రిటీలను మోసం చేసిన ఈమె కోట్లు దండుకున్నారు. ఇలాంటివారిలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు చెల్లి ప్రియదర్శిని కూడా ఉన్నారు. ఈమె వద్ద రూ.2 కోట్ల మేరకు శిల్పాచౌదరి టోకరా పెట్టినట్టు తెలుస్తోంది. 
 
హైదరాబాద్ నగరం, గండిపేటలోని సిగ్నేచర్ విల్లాలో పదేళ్లుగా నివాసం ఉంటూ వచ్చిన శిల్పా చౌదరి, శ్రీకృష్ణ శ్రీనివాస్ ప్రసాద్ అనే దంపతులు దివానోస్ పేరుతో ఓ పేకాట క్లబ్‌ను ప్రారంభించారు. పైగా, కోటీశ్వరులుగా తమను తాము పరిచయం చేసుకున్నవీరు టీవీ, సినీ నిర్మతలుగా నమ్మించారు. అలా అనేక మంది సినీ ప్రముఖులను కలుసుకుంటూ వీకెండ్ పార్టీలకు ఆహ్వానించేవారు. 
 
ఆరంభంలో అతి తక్కువ మందితో కిట్టీపార్టీ మొదలుకాగా, ఆ తర్వాత ఆ పార్టీలను దివానోస్ పేరుతో పేకాట క్లబ్బుగా మార్చేశారు. ఇందులో తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన దాదాపు 100 మంది వరకు సెలెబ్రిటీల కుటుంబాలకు చెందిన మహిళలు సభ్యులుగా ఉన్నారు. 
 
అయితే, శిల్పా చౌదరి దంపతుల చేతిలో మోసపోయినట్టు గ్రహించిన ప్రియదర్శిని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి కూపీలాగగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మూడు రాష్ట్రాలను భయపెడుతున్న జవాద్ తుఫాను