ఇంటికి రూ.8 కోట్ల కొత్త కరెన్సీ ఎలా వచ్చింది.. జే.శేఖర్ రెడ్డి మరో కొత్త కేసు
ఇసుక వ్యాపారి, నల్లకుబేరుడు జే.శేఖర్ రెడ్డిపై సీబీఐ కేసు నమోదు చేసింది. ఇటీవల ఆయన నివాసంలో ఆదాయపన్ను శాఖ అధికారులు నిర్వహించిన సోదాల్లో రూ.కోట్ల నల్లధనం బయటపడిన విషయం తెల్సిందే. ఇందులోభాగంగా రూ.8 కోట్
ఇసుక వ్యాపారి, నల్లకుబేరుడు జే.శేఖర్ రెడ్డిపై సీబీఐ కేసు నమోదు చేసింది. ఇటీవల ఆయన నివాసంలో ఆదాయపన్ను శాఖ అధికారులు నిర్వహించిన సోదాల్లో రూ.కోట్ల నల్లధనం బయటపడిన విషయం తెల్సిందే. ఇందులోభాగంగా రూ.8 కోట్ల కొత్త కరెన్సీని (రూ.2 వేల నోటు) స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇంట్లో రూ.8 కోట్ల విలువైన కొత్త రెండు వేల రూపాయుల నోట్లను అక్రమగా దాచి ఉంచాడన్న నేరారోపణలపై ఈ కేసు నమోదు చేసి మరోమారు అరెస్టు చేసిది. ముంగళవారం ఉదయం పుళల్ సెంట్రల్ జైలుకెళ్లిన సీబీఐ అధికారులు కొత్త కేసులో ఆయనను అరెస్టు చేస్తున్నట్లు ప్రకటాంచారు.
ఆ తర్వాత సీబీఐ కోర్టులో హాజరుపరిచారు. శేఖర్ రెడ్డి ఆయ అనుచరులు ఇద్దరికి ఈ నెల 17 వరకు జ్యుడీషియల్ కస్టడీ పొడిగిస్తూ మేజిస్ట్రేట్ ఆదేశాలిచ్చారు. వేలూరు జిల్లాకు చెందిన ఈ కాంట్రాక్టర్ను గత డిసెంర్ 21వ తేదీన ఆయనతో పాటు ఆయన అనుచరులను సీబీఐ అరెస్టు చేసిన విషయం తెల్సిందే.