Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రఘురామకు తొలి రోజు వైద్యపరీక్షలు పూర్తి... షీల్డు కవర్‌లో సుప్రీంకు...

రఘురామకు తొలి రోజు వైద్యపరీక్షలు పూర్తి... షీల్డు కవర్‌లో సుప్రీంకు...
, బుధవారం, 19 మే 2021 (14:52 IST)
వైకాపా రెబెల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజుకు సికింద్రాబాద్‌లోని ఆర్మీ ఆస్పత్రిలో తొలి రోజు నిర్వహించిన వైద్య పరీక్షలు పూర్తయ్యాయి. వీటిని సంబంధించిన రిపోర్టులను షీల్డు కవర్‌లో సుప్రీంకోర్టుకు చేరవేశారు. అలాగే, రెండో రోజైన బుధవారం కూడా ఆయనకు వైద్య పరీక్షలు చేశారు. 
 
ముఖ్యంగా, రఘురామ అరికాళ్లకు అయిన గాయాలపై మంగళవారం నిర్వహించిన వైద్య పరీక్షల నివేదికను తెలంగాణ హైకోర్టు సీల్డు కవర్‌లో సుప్రీం కోర్టుకు పంపించింది. రక్తం, చర్మ పరీక్షలు నిర్వహించినట్లు ఆర్మీ వైద్యులు నివేదికలో పేర్కొన్నారు. 
 
సీల్డ్ కవర్‌లోని నివేదిక, వీడియోను శుక్రవారం సుప్రీం కోర్టు పరిశీలించనున్నట్లు సమాచారం. మళ్లీ సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చే వరకు రఘురామ ఆర్మీ ఆస్పత్రిలో జ్యడిషియల్ కస్టడీలో ఉంటారు. కొవిడ్ నిబంధనల ప్రకారమే ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించామని ఆర్మీ వైద్యులు తెలిపారు.
 
మరోవైపు, ఎంపీ రఘురామ కృష్ణంరాజుకు సికింద్రబాద్‌లోని తిరుమల గిరి ఆర్మీ ఆస్పత్రిలో రెండో రోజు బుధవారం వైద్య పరీక్షలు జరుగుతున్నాయి. ఆర్మీ వైద్యులు బీపీ, షుగర్, బ్లడ్ టెస్ట్‌లు పూర్తి చేశారు. ఆర్మీ ఆస్పత్రిలో ప్రత్యేక గదిలో రాఘురామ విశ్రాంతి తీసుకుంటున్నారు. 
 
ఆర్మీ పోలీసులు వాహనాలు తనిఖీలు చేసి, అనుమతి ఉన్నవారికి మాత్రమే లోపలకు పంపిస్తున్నారు. రఘురామకు ఆర్మీ ఆస్పత్రిలో హైకోర్టు నియమించిన జ్యుడీషియల్ అధికారి పర్యవేక్షణలో వైద్య పరీక్షలు కొనసాగుతున్నాయి. ఆర్మీ హాస్పిటల్‌కు చెందిన ముగ్గురు వైద్య అధికారుల బృందంతో వైద్య పరీక్షలు జరుగుతున్నాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏపీ సర్కారు మెడకు కోర్టు ధిక్కరణ.. నోటీసుల జారీకి హైకోర్టు ఆదేశం