Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వివిధ పధకాల రూపంలో గిరిజ‌నుల‌కు రూ.6,646 కోట్లు ల‌బ్ధి: పుష్ప శ్రీవాణి

వివిధ పధకాల రూపంలో గిరిజ‌నుల‌కు రూ.6,646 కోట్లు ల‌బ్ధి: పుష్ప శ్రీవాణి
, గురువారం, 12 ఆగస్టు 2021 (09:41 IST)
రాష్ట్రంలో గత రెండేళ్ల కాలంలో గిరిజనులకు వివిధ పథకాల కింద రూ.6646 కోట్లు లబ్ధి చేకూర్చామని ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖామంత్రి పాముల పుష్ప శ్రీవాణి అన్నారు. ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డు ట్రైబ్స్ కోపరేటివ్ ఫైనాన్స్ కార్పోరేషన్ లిమిటెడ్ ఛైర్మన్‌గా నియమింపబడిన సకత‌ బుల్లిబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పుష్ప శ్రీవాణి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పుష్ప శ్రీవాణి మాట్లాడుతూ గిరిజనుల ఆర్థిక సామాజిక విద్య వైద్య రంగాలలో వారి ఎదుగుదలకు ప్రాముఖ్యతనిస్తూ, గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి, సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ ముఖ్యమంత్రి వైయస్  జగన్మోహన್‌రెడ్డి అనేక సంక్షేమ అభివృద్ధి పధకాలను అమలు చేస్తున్నారని అన్నారు.

గత రెండు సంవత్సరాల కాలంలో రూ.6646 కోట్లు గిరిజనులకు లబ్ధి చేకూరిందని, ఇంత భారీ స్థాయిలో గిరిజనులకు ఆర్ధిక ప్రయోజనం చేకూరడం రాష్ట్ర చరిత్రలో ఇదే తొలిసారని మంత్రి అన్నారు. రూ.8 వేల కోట్లతో ట్రైబల్ సబ్‌ప్లాన్‌ను అమలు చేస్తున్నామని, రూ.746 కోట్లతో గిరిజన ప్రాంతాలలో వైద్యసదుపాయాలు మెరుగుపరుచుటలో భాగంగా డా. వైయస్ఆర్ ట్రైబల్ మెడికల్ కాలేజీ, మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులు నిర్మిస్తున్నామని మంత్రి అన్నారు.

భూమిలేని గిరిజనులకు రెండు ఎకరాలు పోడుభూమిని పట్టాలుగా అందించి వ్యవసాయానికి అనువుగా ఉండే భూమిగా అభివృద్ధి పరిచి రాష్ట్రంలో 2 లక్షల 28 వేల ఎకరాల భూమిని అటవీ హక్కుల చట్టం క్రింద గిరిజనులకు పంపిణి చేసామని మంత్రి అన్నారు. 100 నుండి 200 యూనిట్లు వరకూ గిరిజనులు గృహావసరాలకు వినియోగించే విద్యుత్తు ఖర్చును ప్రభుత్వమే భరించి గిరిజనులకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తున్నదని మంత్రి అన్నారు.

విజయనగరం జిల్లా కురుప్పాంలో రూ. 153 కోట్లతో ట్రైబల్ ఇంజినీరింగ్ కళాశాలను ఏర్పాటు చేశామన్నారు. ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజనులు సేకరించిన అటవీ ఉత్పత్తులను, గిరిజనులు సాగుచేసి పండించిన వ్యవసాయ ఉత్పత్తులను గిరిజన కోపరేటివ్ కార్పోరేషన్ సేకరిస్తుందని దీనిలో భాగంగా తేనె, చింతపండు, కుంకుడుకాయలు, నన్నారి ఉత్పత్తులు, కాఫీ, రాజ్ మా, పసుపు, రాగి, జీడిపప్పు, తదితర ఉత్పత్తులను గిరిజనులకు మద్దతు ధర అందించి గిరిజన కోప రేటివ్ కార్పోరేషన్ కొనుగోలు చేస్తున్నదని మంత్రి అన్నారు.

2020-21 సంవత్సరంలో గిరిజన కోపరేటివ్ కార్పోరేషన్ రూ. 450 కోట్ల మేర వ్యాపార లావాదేవీలు నిర్వహించిందని మంత్రి తెలిపారు.

గిరిజన ప్రాంతాలలో పోషకాహార లోపం కారణంగా ఏర్పడిన రక్త హీనతతో అనేకమంది బాలింతలు, శిశువులు మరణిస్తున్నారనే విషయం పై రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్. జగన్మోహన రెడ్డి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారని దీనిలో భాగంగా గిరిజన ప్రాంతాలలో బాలింతల కోసం అలాగే పిల్లల కోసం  గిరి గోరుముద్దలు, బాలసంజీవని, పోషకాహారబుట్ట లాంటి ప్రత్యేక పోషకాహార పధకాలను ఏజెన్సీ గ్రామాలలో అమలుచేస్తున్న‌ట్లు తెలిపారు.

గిరిజన ప్రాంతాలలో గడిచిన రెండు సంవత్సరాల కాలంలో రూ. 450 కోట్లతో విద్యాసంస్థ‌ల భవనాలు, గిరిజన ప్రాంతాలను కలుపుతూ రోడ్డు నిర్మాణ పనులను చేపట్టామన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

విజయదశమికి ఏపి మంత్రి వర్గ విస్తరణ?