Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మనిషి దంతాలతో వింత చేప?

Advertiesment
fish teeth

ఠాగూర్

, ఆదివారం, 6 జులై 2025 (09:31 IST)
ఏపీలోని వెస్ట్ గోదావరి జిల్లాలో ఓ వింత చేప కనిపించింది. ఈ వింత చేప ప్రత్యేకత ఏంటే... ఈ చేపకు మనిషి దంతాలు ఉండటమే. దీంతో ఈ చేపను చూసేందుకు స్థానికులు క్యూ కట్టారు. చేప నోరు తెరిసి చూస్తే.. మనిషి పళ్ల వరుస కనిపించడంతో ఆ చేపను చూసినవారంతా అవాక్కవుతున్నారు. ఈ చేప ఇపుడు స్థానికంగా చర్చనీయాంమశంగా మారింది. 
 
వివరాలను పరిశీలిస్తే, మొగల్తూరు మండలం సుబ్రహ్మణ్యేశ్వరం రోడ్డులోని ఓ చేపల చెరువులో ఈ రూప్ చంద్ అనే చేప కనిపించింది. ఈ చేప నోట్లోని పళ్ల వరుస అచ్చం మనిషి కింద దవడను పోలి ఉండటం విశేషం. ఇది చూడటానికి వింతగా ఉన్నా.. ఇది చాలా ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా, చేపలను పట్టే రైతులు ఏమాత్రం ఆజాగ్రత్తగా ఉన్నా... ఇది చేతివేళ్లను బలంగా కొరికేస్తుందని చెబుతున్నారు. 
 
ఈ చేపపై నరసాపురం మత్స్యకారుల అసోసియేషన్ డీన్ నీరజ మాట్లాడుతూ, రూప్ చంద్ చేపలు ప్రమాదకరమైన పిరాన్హా జాతికి చెందిన చేపలని చెప్పారు. ఇవి పూర్తిస్థాయి మాంసాహారులను ఆమె తెలిపారు. చెరువుల్లో నీటిని సాధారణంగా రెండు నుంచి మూడు కిలోల బరువు పెరిగే వరకు పెంచుతారని ఆమె వివరించారు. ఈ నేపథ్యంలో పెంపకందారులు తగిన జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి అని నిపుణులు సూచిస్తున్నారు. 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇష్టం లేని పెళ్లి చేయొద్దంటే వింటే కదా! 27మందికి పాలలో ఎలుకల మందు కలిపిచ్చిన యువతి!