Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చంద్రబాబు, నారా లోకేష్ పైన రోజా తీవ్ర విమర్శలు

చంద్రబాబు, నారా లోకేష్ పైన రోజా తీవ్ర విమర్శలు
, శుక్రవారం, 5 నవంబరు 2021 (20:08 IST)
ప్రతిపక్షనేత చంద్రబాబుపై మరోసారి తీవ్రస్థాయిలో ఫైరయ్యారు రోజా. రోజుకొక మాట్లాడుతున్న చంద్రబాబును ఎవరూ నమ్మరని.. క్రిందిస్థాయి టిడిపి నేతలను రెచ్చగొట్టి ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చంద్రబాబు చేస్తున్నారంటూ మండిపడ్డారు. అసలెప్పుడు చంద్రబాబు ఏం మాట్లాడుతారో ఆయన కన్నా అర్థమవుతుందా అంటూ ప్రశ్నించారు.

 
చిత్తూరు జిల్లా నగరిలో మీడియాతో రోజా మాట్లాడారు. సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటించి చంద్రబాబు ఒక మాట మాట్లాడతారు. హైదరాబాద్‌లో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి మరోసారి మాట్లాడుతారు. చంద్రబాబుకు పిచ్చెక్కింది.

 
ఖచ్చితంగా ఆయన్ను పిచ్చాసుపత్రికి పంపించండి.. చికిత్స చేయించండి అంటూ రోజా ఫైరయ్యారు. మరోసారి ప్రభుత్వంపై టిడిపి నేతలు లేనిపోని విమర్సలు చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. 
 
పట్టాభి మాటల తరువాత రాష్ట్రంలో అలజడి రేగింది. అందుకు పూర్తి కారణం చంద్రబాబే. నేతలను రెచ్చగొట్టడం.. విమర్సలు చేయించండి.. ముఖ్యమంత్రిపైనా, ఆయన తల్లిపైనా మాట్లాడడం.. ఇదంతా నిజంగా చూస్తుంటే రాష్ట్ర ప్రజలు నవ్వుకుంటున్నారు. చంద్రబాబు మారరు. 

 
అతనిలో మార్పు రాకపోగా మరో పప్పు దాపురించాడు. ట్విట్టర్ పప్పు ఏం చేస్తున్నాడో ఎవరికీ తెలియదు. అప్పుడప్పుడు తళుక్కున మెసేజ్ పెట్టి వెళ్ళిపోతాడు. అది అతని పరిస్థితి. తెలుగుదేశం గురించి మాట్లాడడం అనవసరం.. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజల్లోకి దూసుకెళుతున్నాయి కాబట్టి ప్రజలు ప్రతిపక్ష పార్టీలు ఎంత రాద్దాంతం చేస్తున్నా పట్టించుకోవడం లేదన్నారు రోజా.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలంగాణలో హజ్‌యాత్రకు దరఖాస్తుల స్వీకరణ షురూ