Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రివ‌ర్స్ పాలిటిక‌ల్ ట్రెండ్... వైసీపీ నుంచి టీడీపీకి మ‌ల్యాద్రి

రివ‌ర్స్ పాలిటిక‌ల్ ట్రెండ్... వైసీపీ నుంచి టీడీపీకి మ‌ల్యాద్రి
విజ‌య‌వాడ‌ , శుక్రవారం, 8 అక్టోబరు 2021 (13:56 IST)
ఏపీలో రాజ‌కీయం ఎపుడు ఎటు మ‌లుపు తిరుగుతుందో తెలియ‌ని ప‌రిస్థితులు. ఒక‌సారి టీడీపీ నుంచి వైసీపీకి వ‌ల‌స‌లు మొద‌ల‌వ‌గా, ఇపుడు కొత్త‌గా ట్రెండ్ మొద‌లైంది. వైసీపీ నుంచి టీడీపీకి నాయ‌కులు వ‌ల‌స‌పోవ‌డం క‌నిపిస్తోంది. అది సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి విధానాలు న‌చ్చ‌క కొంద‌రైతే, స్థానికంగా వైసీపీ నేత‌ల‌తో పొస‌గ‌క మ‌రికొంద‌రు వ‌ల‌స‌బాట ప‌డుతున్నారు. 

 
ప్రకాశం జిల్లా కనిగిరి వైసీపీ నుంచి టీడీపీకి ఇపుడు వ‌ల‌స‌లు ఆరంభం అయ్యాయి. టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి, శ్రీ నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీలో చేరేందుకు నేత‌లు ఇలా కారుల్లో బారులు తీరారు. కనిగిరి నియోజకవర్గ పామూరు మండ‌లానికి చెందిన బొల్లా మాల్యాద్రి చౌదరి, 300 మంది వైసీపీ నాయకులు, కార్యకర్తల‌తో భారీగా ర్యాలీ తీశారు.


వంద కార్లలో భారీ ర్యాలీగా టీడీపీలో చేరేందుకు మాజీ ఎమ్మెల్యే ఉగ్ర నరసింహరెడ్డి  ఆధ్వర్యంలో స‌మాయ‌త్తం అయ్యారు. టీడీపీలో చేరేందుకు అమరావతి బయలు దేరిన వైసిపీ కార్యకర్తలు, కార్యకర్తలు పార్టీ అధినేత స‌మ‌క్షంలో తెలుగుదేశం తీర్థం తీసుకోనున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తాకట్టులో ఆంధ్రప్రదేశ్ : పవన్ కళ్యాణ్ అటాక్