భర్తను కాదని ప్రియుడి కోసం యూఎస్ నుంచి విజయవాడ వచ్చిన ప్రేయసి... ప్రియుడు పరార్...
ప్రేమించిన వాడి కోసం కట్టుకున్న భర్తను వదిలేసి వచ్చిన ప్రేయసి, ప్రియుడు ముఖం చాటేయడంతో నిద్రమాత్రలు మింగి ఆస్పత్రిపాలైంది. వివరాల్లోకి వెళితే... మానస అనే యువతి తన భర్తతో అమెరికాలో ఉంటుంది. ఐతే తను ప్రేమించిన హేమంత్ రెడ్డి అనే యువకుడిని మనసులో నుంచి త
ప్రేమించిన వాడి కోసం కట్టుకున్న భర్తను వదిలేసి వచ్చిన ప్రేయసి, ప్రియుడు ముఖం చాటేయడంతో నిద్రమాత్రలు మింగి ఆస్పత్రిపాలైంది. వివరాల్లోకి వెళితే... మానస అనే యువతి తన భర్తతో అమెరికాలో ఉంటుంది. ఐతే తను ప్రేమించిన హేమంత్ రెడ్డి అనే యువకుడిని మనసులో నుంచి తీసేయలేకపోయింది. దీంతో ఎలాగైనా ప్రేమించినవాడితోనే జీవితం పంచుకోవాలని అమెరికాలో విమానం ఎక్కేసి నేరుగా విజయవాడ వచ్చింది. ఇక్కడ దిగగానే ప్రియుడి కోసం ఫోన్ చేసింది.
ఐతే ప్రియుడు ఫోన్ కలవలేదు సరికదా... పత్తా లేకుండా పరారయ్యాడతను. దీనితో తీవ్ర ఆవేదనకు గురైన యువతి తల్లిదండ్రుల ఇంటికి వెళ్లేందుకు ప్రయత్నించగా వారు ఇంటికి రానివ్వలేదు. బంధువుల ఇంటికి వెళ్లి... అక్కడి నుంచి మళ్లీ ప్రియుడి కోసం ఫోన్ చేసింది. ఫోన్ స్విచాఫ్ చేసి ఉండటంతో మనస్తాపానికి గురైన మానస నిద్రమాత్రలు మింగింది. విషయం తెలుసుకున్న బంధువులు ఆమెను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు సమాచారం.