700 సంవత్సరాల దేవాలయం... ఇప్పుడు బయట పడింది
విజయనగరం: అత్యంత పురాతన దేవాలయం ఇపుడు తవ్వాకాల్లో బయటపడింది. విజయనగరం సమీపంలోని వేణుగోపాలపురం గ్రామం వద్ద ఈ పురాతన దేవాలయం వెలుగులోకి వచ్చింది. ఏడు వందల సంవత్సారాల క్రితం విజయనగరం సంస్థానానికి చెందిన పూసపాటి రాజులు ఇక్కడ దేవాలయాన్ని ని
విజయనగరం: అత్యంత పురాతన దేవాలయం ఇపుడు తవ్వాకాల్లో బయటపడింది. విజయనగరం సమీపంలోని వేణుగోపాలపురం గ్రామం వద్ద ఈ పురాతన దేవాలయం వెలుగులోకి వచ్చింది. ఏడు వందల సంవత్సారాల క్రితం విజయనగరం సంస్థానానికి చెందిన పూసపాటి రాజులు ఇక్కడ దేవాలయాన్ని నిర్మించి పూజలు చేసేవారని తెలుస్తోంది.
పాత రాతి కట్టడంతో ఉన్న ఈ దేవాలయంలో మన్నారు రాజగోపాలస్వామి రాతి విగ్రహం లభ్యం కావడంతో అందరూ ఆశ్చర్యచకితులయ్యారు. అర్చకులు, వైష్ణవ భక్తులు పెద్ద ఎత్తున ఇక్కడ పూజలు నిర్వహించారు. పురావస్తు శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ తవ్వకాలు ఓ గొప్ప దేవాలయాన్నివెలుగులోకి తెచ్చాయని అంటున్నారు.