Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బీహారులో దారుణం... తుపాకీని మర్మాంగంలో పెట్టి భయపెడుతూ గ్యాంగ్ రేప్... ఆపై కట్టెపుల్లలు...

బీహార్‌లోని మోతిహారిలో కనివినీ ఎరుగని దారుణం చోటుచేకుంది. కామంతో కళ్లు మూసుకుపోయిన కామాంధులు తుపాకీతో బెదిరించి 21 ఏళ్ల యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. తుపాకీని, కట్టె పుల్లలను ఆమె మర్మాంగా

Advertiesment
Nirbhayarape
, గురువారం, 23 జూన్ 2016 (18:25 IST)
బీహార్‌లోని మోతిహారిలో కనివినీ ఎరుగని దారుణం చోటుచేకుంది. కామంతో కళ్లు మూసుకుపోయిన కామాంధులు బాధితురాలి మర్మాంగం వద్ద తుపాకీని పెట్టి బెదిరిస్తూ 21 ఏళ్ల యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత తుపాకీని, కట్టె పుల్లలను ఆమె మర్మాంగాల్లో పెట్టి... ఆమె తల్లడిల్లుతుంటే పైశాచికానందం పొందారు. ఆపై అతికిరాతకంగా కామకలాపాలు సాగించారు. అత్యాచారం అనంతరం రోడ్డుపై విసిరేశారు. రక్తగాయాలతో విషమ పరిస్థితులతో రోడ్డు పక్కన వివస్త్రగా పడి ఉన్న బాధితురాలిని అటుగా వెళ్తున్న స్థానికులు గుర్తించి ఆస్పత్రికి తరలించారు. 
 
నిందితుల్లో ఒకరైన సమీవుల్లా అనే కామక్రూరుడు ఇదే యువతిని లైంగికంగా వేధించి ఓ వీడియోని తీశాడు. ఆ వీడియోని చూపించి ఆమెను లొంగదీసుకునేందుకు అతడితోపాటు మరికొందరు కామాంధులు ప్రయత్నించారు. దీంతో ఆగ్రహించిన యువతి వారిపై బ్లేడ్‌తో దాడి చేయబోయింది. కోపంతో రెచ్చిపోయిన కామపిశాచులు ఆమెపై దారుణంగా సామూహిక అత్యాచారం చేశారు. 
 
తనను కొట్టడంతోపాటు తనపై అత్యాచారం చేసినట్టు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలు మీడియాకు వెల్లడించింది. వీరేకాకుండా నిందితుల కుటుంబ సభ్యులు కూడా తనపై దాడికి పాల్పడ్డారని వాపోయింది. అయితే ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆమె తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇలాంటి ప‌నులు నా జీవితంలో చూడ‌లేదు.. సోమా కంపెనీపై సీఎం బాబు ఫైర్...