Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కామారెడ్డి రోడ్డు ప్రమాదంపై పవన్ కల్యాణ్ దిగ్భ్రాంతి

Pawan kalyan
, సోమవారం, 9 మే 2022 (18:57 IST)
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కామారెడ్డి రోడ్డు ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఒకే కుటుంబానికి చెందిన తొమ్మిది మంది చనిపోవడం బాధాకరమన్నారు. ప్రమాదానికి కారణం అతివేగమే అని తెలుస్తుందని… గ్రామీణ ప్రాంతాల్లోని రహదారులపై వేగాన్ని అదుపు చేయడానికి రవాణా శాఖ అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 
 
మృతుల కుటుంబాలను, గాయపడిన వారిని తెలంగాణ ప్రభుత్వం ఆర్థికంగా, వైద్యపరంగా ఆదుకోవాలి పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేశారు. ప్రమాదంలో మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ… మృతుల కుటుంబ సభ్యులకు పవన్ కళ్యాణ్ ప్రగాఢ సానుభూతి తెలిపారు.
 
కాగా కామారెడ్డి జిల్లా హాసన్ పల్లి గేట్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తొమ్మిది మంది మృతి చెందడంతో పాటు మరో 14మంది గాయపడ్డారు. ఈ ప్రమాదంలో పిట్లం మండలం చిల్లర్గికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన వారు మరణించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తల్లకిందులుగా తపస్సు చేసినా.. జగన్‌ని అంగుళం కూడా కదపలేరు