Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఇంటిముందు ఆడుకుంటున్న ఆరేళ్ల బాలికను ఎత్తుకుపోయి?

ఇంటిముందు ఆడుకుంటున్న ఆరేళ్ల బాలికను ఎత్తుకుపోయి?
, శుక్రవారం, 22 మార్చి 2019 (14:33 IST)
ఇంటిముందు ఆడుకుంటున్న ఆరేళ్ల బాలికను ఎత్తుకుపోయి అత్యాచారం చేసి చంపేశాడు ఓ దుర్మార్గుడు. ఈ దుర్ఘటన మేడ్చల్‌ జిల్లా అల్వాల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని తుర్కపల్లిలో గురువారం చోటుచేసుకుంది. చంద్రయ్య, కృష్ణవేణి దంపతులు కొన్ని సంవత్సరాల క్రితం మెదక్‌ జిల్లా నుంచి నగరానికి వలస వచ్చి తుర్కపల్లిలో నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు. 
 
గురువారం మధ్యాహ్నం ఇంటి ముందు ఆడుకుంటున్న పాప కనిపించకుండా పోయింది. తల్లిదండ్రులు ఎక్కడ వెతికినా కనిపించలేదు. చివరికి స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసారు. రాత్రి 12 గంటల సమయంలో అటుగా వెళ్తున్న కొందరికి శవం కనిపించింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి అది పాపదేనని గుర్తించారు. 
 
పోస్ట్‌మార్టం చేయించారు. బాలికను అత్యాచారం చేసి గొంతు నులిమి చంపినట్లు పంచనామాలో తేలింది. బాధితురాలి ఇంటి ప్రక్కన ఉన్న బిహార్‌కు చెందిన ఆరుగురు యువకులపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నిందితుడు పరారీలో ఉన్నట్లు తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నిన్న కికీ ఛాలెంజ్.. ఇపుడు మైక్రోవేవ్ ఛాలెంజ్... ఎలా చేయాలి?