Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ర‌మ్య హ‌త్య‌పై సీఎం ఆరా; కుటుంబానికి రూ.10లక్షల ప‌రిహారం

Advertiesment
ramya
గుంటూరులో యువతి రమ్య హత్యా ఘటనపై సీఎం వైయస్‌.జగన్‌ అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి దర్యాప్తును వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.

‘దిశ’ కింద వేగంగా చర్యలను తీసుకుని దోషికి కఠినశిక్ష పడేలా చేయాలన్నారు. ఘటన వివరాలు తెలియగానే, హోంమంత్రి సుచ‌రిత‌ ఆస్పత్రికి వెళ్లి బాధిత కుటుంబాన్ని పరామర్శించారని, ఆ కుటుంబానికి అండగా నిలబడతామంటూ భరోసా ఇచ్చిన విషయాన్ని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.

బాధిత కుటుంబాన్ని ఆదుకునేలా తగిన చర్యలు తీసుకోవాలని, పరిహారంగా రూ.10లక్షలు ఆకుటుంబానికి ఇవ్వాలని సీఎం ఆదేశించారు. నిందితుడికి క‌ఠిన శిక్ష ప‌డేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆయ‌న పోలీసు అధికారుల‌ను ఆదేశించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మాజీ ప్రధాని వాజ్‌పేయి తృతీయ వర్థంతి : ఘనంగా నివాళులు