Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నేటి నుంచి రాజమహేంద్రవరం -కాకినాడ నాన్‌స్టాప్‌ సర్వీసులు

నేటి నుంచి రాజమహేంద్రవరం -కాకినాడ నాన్‌స్టాప్‌ సర్వీసులు
, బుధవారం, 16 జూన్ 2021 (08:52 IST)
రాజమహేంద్రవరం-కాకినాడ నాన్‌స్టాప్‌ సర్వీసులు బుధవారం నుంచి తిరిగి ప్రారంభమవుతున్నాయి. కరోనా సెకండ్‌ వేవ్‌ నేపథ్యంలో ప్రభుత్వం కర్ఫ్యూ అమలు చేస్తుండడంతో గత కొన్ని రోజులుగా ఈ రూటులో సర్వీసులు మొత్తం నిలిచిపోయాయి.

ఇటీవల మధ్యాహ్నం 2 గంటల వరకూ సడలింపులు ఇవ్వడంతో ఆర్టీసీ పరిమిత సంఖ్యలో లోకల్‌ సర్వీసులు నడుపుతోంది. విజయవాడ, విశాఖపట్నం తదితర దూరప్రాంత రూట్లలోనూ ఒకటి, రెండు సర్వీసులు తిప్పుతున్నారు. ఈ నేపథ్యంలో రాజమహేంద్రవరం- కాకినాడ నాన్‌స్టాప్‌ సర్వీసులకున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని మళ్లీ ఈ సర్వీసులను పునరుద్ధరిస్తున్నారు.

ఇందులో భాగంగా కాకినాడకు రాజమహేంద్రవరం ఆర్టీసీ కాంప్లెక్స్‌ నుంచి ఉదయం 5.30కు తొలి సర్వీసు, ఆఖరి సర్వీసు మధ్యాహ్నం 12.30కు బయలుదేరుతుంది. కాకినాడ డిపో నుంచి కూడా ఇదే సమయాల్లో రాజమహేంద్రవరంనకు నాన్‌స్టాప్‌ సర్వీసులు నడుస్తాయి. ప్రతి 40 నిమిషాలకు ఒకటి చొప్పున మొత్తం 12 సర్వీసులు నడిపేందుకు ఏర్పాట్లుచేస్తున్నామని అధికారులు తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

29న విశాఖ స్టీల్‌ప్లాంట్‌ లో సమ్మె