Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఎన్‌ఐటీలో ర్యాగింగ్‌.. జూనియర్‌ను చితకబాదిన సీనియర్లు

Advertiesment
ఎన్‌ఐటీలో ర్యాగింగ్‌.. జూనియర్‌ను చితకబాదిన సీనియర్లు
, శుక్రవారం, 25 మార్చి 2022 (14:21 IST)
Ragging
తాడేపల్లిగూడెం ఎన్‌ఐటీలో ర్యాగింగ్‌ కలకలం రేగింది.  సీనియర్లు తొమ్మిది మంది కలిసి.. ఒక విద్యార్థిని చావబాదారు. ఫోన్‌ చేసి పిలిచి.. హాస్టల్‌ గదిలో దాడి చేశారు. చేతికి దొరికిన వస్తువులతో చితక్కొట్టారు. ఈ వివాదం ముందే డైరెక్టర్‌ దాకా వెళ్లినా.. పట్టించుకోకపోవడంతో దాడి వరకు వెళ్లింది.
 
వివరాల్లోకి వెళితే.. బీటెక్‌ మెకానికల్‌ సెకండియర్‌ చదువుతున్న జయకిరణ్‌కి.. సీనియర్లకు మధ్య కొంతకాలంగా వివాదం నడుస్తోంది. ఈ క్రమంలోనే జయకుమార్‌ను ఫ్రెండ్‌ రూమ్‌కి పిలిపించిన సీనియర్లు.. రాత్రి పది గంటల నుంచి ఉదయం పది గంటల వరకు మోకాళ్లపై కూర్చోబెట్టారు. హాస్టల్‌ గదిలో చేతికి అందిన జగ్గు, వాటర్‌ బాటిళ్లతో విచక్షణారహితంగా దాడి చేశారు. కర్రలు, బెల్టులతో చావబాదారు.
 
తీవ్రగాయాలపాలైన జయకిరణ్‌.. వారు విడిచిపెట్టిన తర్వాత హాస్పిటల్‌కి వెళ్లి చికిత్స తీసుకున్నాడు. తల్లిదండ్రులకు విషయం చెప్పడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసులు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం.. రామేశ్వరం వచ్చేస్తున్న తమిళులు