Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

టేబుల్‌పైకెక్కి నిరసన తెలుపుతారా? వచ్చి వివరణ ఇవ్వండి... వైకాపా ఎమ్మెల్యేలకు ప్రివిలేజ్ కమిటీ పిలుపు

వైఎస్. జగన్ మోహన్ రెడ్డి సారథ్యంలోని వైకాపాకు ఊహించని పరిణామం ఎదురైంది. ఆ పార్టీకి చెందిన 12 మంది ఎమ్మెల్యేలకు ప్రివిలేజ్ కమిటీ నోటీసులు జారీచేసింది. వీరంతా ఈ నెల 25, 26 తేదీల్లో కమిటీ ముందు హాజరు కావ

Advertiesment
టేబుల్‌పైకెక్కి నిరసన తెలుపుతారా? వచ్చి వివరణ ఇవ్వండి... వైకాపా ఎమ్మెల్యేలకు ప్రివిలేజ్ కమిటీ పిలుపు
, మంగళవారం, 18 అక్టోబరు 2016 (15:45 IST)
వైఎస్. జగన్ మోహన్ రెడ్డి సారథ్యంలోని వైకాపాకు ఊహించని పరిణామం ఎదురైంది. ఆ పార్టీకి చెందిన 12 మంది ఎమ్మెల్యేలకు ప్రివిలేజ్ కమిటీ నోటీసులు జారీచేసింది. వీరంతా ఈ నెల 25, 26 తేదీల్లో కమిటీ ముందు హాజరు కావాలని నోటీసులో పేర్కొంది. 
 
ఇటీవల జరిగిన ప్రత్యేక సమావేశాల సందర్భంగా, ఈ ఎమ్మెల్యేలు అసెంబ్లీ కార్యదర్శ టేబుల్‌పైకెక్కి నిరసన తెలపడమేకాక, స్పీకర్ పోడియం వద్ద కూడా గందరగోళం చేశారు. అసెంబ్లీ కార్యదర్శి టేబుల్‌పైకి ఎక్కి నిరసన తెలపడాన్ని ప్రివిలేజ్ కమిటీ తీవ్రంగా పరిగణిస్తోంది. 
 
ఈ నేపథ్యంలోనే, వీరికి ఈ నోటీసులు జారీ అయ్యాయి. ఒక్కోరోజు ఆరుగురు ఎమ్మెల్యేలు కమిటీ ముందు హాజరై, తమ ప్రవర్తన పట్ల వివరణ ఇవ్వాలని నోటీసులో కమిటీ ఆదేశించింది. ప్రత్యేక హోదాకు సంబంధించి సభలో ప్రత్యేక చర్చను చేపట్టాలని డిమాండ్ చేస్తూ వీరు నిరసన తెలిపిన సంగతి తెలిసిందే. 
 
కాగా, నోటీసులు జారీ అయిన వైకాపా ఎమ్మెల్లో కంబాల జోగులు, కిలివేటి సంజీవయ్య, పాశం సునీల్ కుమార్, ముత్యాలనాయుడు, ఆళ్ల రామకృష్ణా రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, దాడిశెట్టి రాజయ్య, కొరుముట్ల శ్రీనివాసులు, చెర్ల జగ్గిరెడ్డి, రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, కొడాలి నాని, పిన్నెల్లి రామకృష్ణారెడ్డిలు ఉన్నారు. 


Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పాట్నా రైల్వే స్టేషన్‌లో ఉచిత వైఫై సేవలు.. పోర్న్ సైట్ల వీక్షణలో టాప్ ప్లేస్