Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రజానాట్య మండలి కళాకారుడు డ‌ప్పు భగవంతరావు ఇక‌లేరు!

Advertiesment
praja
విజ‌య‌వాడ‌ , గురువారం, 11 నవంబరు 2021 (11:59 IST)
ప్రపంచ తెలుగు మహా సభలలో విదేశాలలో ప్రదర్శన లిచ్చిన ప్రజానాట్య మండలి కళాకారుడు డ‌ప్పు భగవంతరావు ఇక లేరు! ఆయ‌న కృష్నా జిల్లా చిట్టూర్పులో తుది శ్వాస విడిచారు. భ‌గ‌వంత‌రావు అనేక దేశాలలో డప్పు ప్రదర్సన లిచ్చారు. అనేక సినిమాలలో ప్రదర్శనలిచ్చారు. అనేక నాటకాలలో డప్పుతో నృత్య ప్రదర్శన లిచ్చిన వాడు, డప్పు వాయిద్యాన్ని శాస్త్రీయంగా రూపొందించినవాడు.
 
 
ఆయ‌న మూడు వేల‌కుపైగా శిష్యులను తయారుచేసి, తను చదువుకోక పోయినా, తనకు తెలిసిన వాయిద్య విద్య‌తో హైదరాబాద్ లోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో డప్పు వాయిద్య ప్రొఫెసర్ గా పనిచేశారు... కుంపటి సూర్య భగవంతరావు. ఆయ‌న‌ గత రాత్రి గుండెపోటుతో మరణించారు.  ఘంటసాల మండలం చిట్టూ ర్పు గ్రామంలో ఆయన పార్థివ దేహాన్ని సందర్శించి ప‌లువురు నివాళులు అర్పించారు. 
 
 
అంబేద్కర్, పూలే జాతీయ అవార్డు గ్రహీత దాసి సీతారామరాజు, జాతీయ ఉత్తమ ఉపాద్యాయ అవార్డు గ్రహీత కొక్కిలిగడ్డ మణి ప్రభాకరరావు, దళిత నాయకులు బూసి సుబ్రహ్మణ్యం,మరియు భగవంతరావు శిస్యులు  కల్లివరపు నాంచారయ్య,చాట్రగడ్డ శ్రీనివాసుడు,కొక్కిలిగడ్డ శ్రీను(పాగోలు) తదితరులు నివాళులు అర్పించారు. రేపు హైదరాబాద్ నుండి, దూర ప్రాంతాల నుండి భగవంతరావు శిష్యులు వచ్చాక అంతిమయాత్ర ప్రారంభమౌతుంది అని కుటుంబ సభ్యులు తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జర్మనీలో ఒక్కరోజే 39 వేలకు పైగా కరోనా కేసులు