Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Tuesday, 1 April 2025
webdunia

నారా లోకేష్‌కు మొదటిసారి చుక్కలు చూపించిన పోలీసులు...

Advertiesment
Police
, సోమవారం, 16 ఆగస్టు 2021 (21:54 IST)
నడి రోడ్డుపై బీటెక్ విద్యార్థినిని యువకుడు అతి దారుణంగా చంపేయడంతో ప్రతిపక్ష నేతలు రోడ్డెక్కారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గుంటూరులో పర్యటిస్తూ ఆ యువతి ఇంటికి వెళ్లారు. దీంతో గంటల తరబడి ఆ ప్రాంతంలో హైడ్రామా నెలకొంది.
 
పోలీసులు లోకేష్‌ను అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. పత్తిపాడు పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. ప్రజలకు ఇబ్బందులు కలిగించేలా లోకేష్ ప్రవర్తించారంటూ కేసులు పోలీసులు పెట్టారు. ఆ తర్వాత ఆయనను పొన్నూరు తరలించారు. అక్కడ నుంచి గుంటూరుకు తరలించారు. పోలీసులు వ్యవహరించిన తీరుపై నారా లోకేష్ మధ్యాహ్న భోజనం తీసుకునేందుకు నిరాకరించారు.
 
నారా లోకేష్‌తో పాటు వచ్చిన కొంతమంది నేతలను కొద్దిసేపటి క్రితమే విడుదల చేశారు. లోకేశ్‌పై 151 సీఆర్పీసీ కింద అభియోగాలు నమోదు చేశారు. పెదకాకాని పీఎస్‌‌లో నోటీసులపై సంతకం పెట్టించుకున్న తర్వాత లోకేశ్‌ను విడిచిపెట్టారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆ పప్పుకు అర్థమయ్యేలా చేస్తాం: రోజా సంచలన వ్యాఖ్యలు