Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆవనిగడ్డ నుంచి మండలి బుద్ధ ప్రసాద్.. పాలకొండ నుంచి జయకృష్ణ

mandali - pawan

సెల్వి

, సోమవారం, 1 ఏప్రియల్ 2024 (22:52 IST)
ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జనసేన అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను దాదాపు పూర్తి చేసుకుంది. అయితే గత కొద్ది రోజులుగా అవనిగడ్డ, పాలకొండ నియోజకవర్గాల జేఎస్పీ అభ్యర్థులపై ఉత్కంఠ నెలకొంది. అయితే ఈ రెండు నియోజకవర్గాలకు జేఎస్పీ అభ్యర్థులను లాక్ చేయడంతో ఉత్కంఠకు తెరపడింది.
 
మండలి బుద్ధ ప్రసాద్, నిమ్మక జయకృష్ణ జనసేనలో చేరారు. ఆ తర్వాత ఎమ్మెల్యే టిక్కెట్లు కేటాయించారు. టీడీపీ సీనియర్ నేత బుద్ధ ప్రసాద్ తెలుగుదేశం నుంచి వైదొలిగి, పవన్ కళ్యాణ్ పార్టీలోకి చేరారు. దీంతో ఆయన అవనిగడ్డ నియోజకవర్గం నుంచి పోటీ చేయడం ఖాయమైంది. 
 
జేఎస్పీలో చేరిన తర్వాత, సీనియర్ రాజకీయవేత్త మాట్లాడుతూ, తాను, పవన్ ఒకే విధమైన మనస్తత్వాన్ని కలిగి ఉన్నామని.. జేఎస్పీతో సక్సెస్ జర్నీ ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. పాలకొండ జేఎస్పీ అభ్యర్థిగా జయకృష్ణ వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే కళావతిపై పోటీ చేయనున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కవితకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలా? వద్దా? బదులివ్వండి... ఈడీకి కోర్టు నోటీసులు