Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఎగ్జిట్ పోల్స్‌ కౌంటింగ్ తప్పైవుంటుంది.. 20 స్థానాలు గ్యారెంటీ.. ఎవరు?

Advertiesment
perni nani

సెల్వి

, శనివారం, 1 జూన్ 2024 (22:14 IST)
దేశంలో సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యాయి. ఎగ్జిట్ పోల్స్‌పై ఓ తెలుగు న్యూస్ ఛానెల్ నిర్వహించిన డిబేట్‌లో ఏపీ మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పేర్ని నాని పాల్గొన్నారు. 
 
ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్‌సీపీ 13 లోక్‌సభ స్థానాలు, టీడీపీ కూటమి 12 సీట్లు గెలుస్తుందని సూచించిన ఎగ్జిట్ పోల్ అంచనాలపై స్పందించిన పేర్ని నాని, తాము 20కి పైగా లోక్‌సభ స్థానాలను గెలుచుకుంటామని విశ్వాసం వ్యక్తం చేశారు. ఏజెన్సీలు తమ శాస్త్రీయ పద్ధతుల్లో లోపాల కారణంగా ఓటర్లను తప్పుగా లెక్కించి ఉండవచ్చని పేర్నినాని పేర్కొన్నారు.
 
అయితే, తమకు బలమైన విశ్వాసం ఉందని, పోలింగ్ రోజున తమ సొంత ఎగ్జిట్ పోల్స్ నిర్వహించామని, దాని ప్రకారం వైఎస్సార్‌సీపీకి 20 లోక్‌సభ స్థానాల కంటే తక్కువ రాదని ఆయన పేర్కొన్నారు. 
 
ఈసారి వైఎస్సార్‌సీపీ, టీడీపీల మధ్య ఓట్ల శాతంలో గట్టి పోటీ ఉందన్న వాదనపై పేర్ని నాని స్పందిస్తూ.. 2014లో వైఎస్‌ జగన్‌కు ఉన్న ఇమేజ్‌తో పాటు 2019 నుంచి 2024 ఎన్నికల వరకు ప్రజల్లో ఉన్న ఇమేజ్‌ను పూర్తిగా పరిశీలించాలని సూచించారు. నేటి పరిస్థితిని 2014తో పోల్చడం సరికాదని అభిప్రాయపడిన ఆయన.. 2019 నుంచి సానుకూల ఓట్ల శాతం పెరుగుతోందని వివరించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

exit polls: ఏపీ ప్రజలు ఎవరికి ఓటు వేశారో ఎవరికీ అర్థం కావట్లేదు