Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కౌలు రైతులకు పవన్ కళ్యాణ్ ఆర్థిక సాయం

pawan kalyan
, ఆదివారం, 19 జూన్ 2022 (17:13 IST)
ఉమ్మడి ప్రకాశం జిల్లాలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదివారం కౌలు రైతు భరోసా యాత్రను చేపట్టారు. ఈ యాత్ర జిల్లాలోని ఏటుకూరు కూడలి, లూలుపురం కూడళ్లలో సాగింది. ఈ సందర్భంగా పవన్‌ తనదైన శైలిలో ప్రజలకు అభివాదం చేశారు. జై జనసేనాని అంటూ అభిమానులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. 
 
చిమటావారిపాలెం డేగలమూడిలో ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబానికి రూ.లక్ష సాయం అందించారు. అనంతరం యద్దనపూడి మండలం యనమదలలో రైతు భరోసా యాత్ర కొనసాగింది. 
 
ఆ తర్వాత పర్చూరులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పవన్‌ ప్రసంగిస్తున్నారు. అయితే, భారీ వర్షం కారణంగా ఎస్‌కేపీఆర్‌ ప్రాంగణంలోని సభాస్థలి తడిసి ముద్దయింది. అయినప్పటికీ ఆయన తన యాత్రను కొనసాగించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తడిసి ముద్దయిన విజయవాడ - ఏకధాటిగా కురిసిన వర్షం