Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప‌వ‌న్ దీక్ష‌కు సంఘీభావంగా అన్ని జిల్లా కేంద్రాల్లో దీక్ష‌లు...

ప‌వ‌న్ క‌ళ్యాణ్ అన్నంత ప‌ని చేసారు. అవ‌స‌ర‌మైతే దీక్ష చేస్తా అని చాలా సంద‌ర్భాల్లో చెప్పారు. ఆఖ‌రికి అన్నట్టుగానే దీక్ష చేస్తున్నారు. శ్రీకాకుళంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ రేపు ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రజల మధ్య దీక్షను కొనసాగించనున్నారు.

ప‌వ‌న్ దీక్ష‌కు సంఘీభావంగా అన్ని జిల్లా కేంద్రాల్లో దీక్ష‌లు...
, శుక్రవారం, 25 మే 2018 (21:07 IST)
ప‌వ‌న్ క‌ళ్యాణ్ అన్నంత ప‌ని చేసారు. అవ‌స‌ర‌మైతే దీక్ష చేస్తా అని చాలా సంద‌ర్భాల్లో చెప్పారు. ఆఖ‌రికి అన్నట్టుగానే దీక్ష చేస్తున్నారు. శ్రీకాకుళంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ రేపు ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రజల మధ్య దీక్షను కొనసాగించనున్నారు. శ్రీకాకుళం జిల్లాలోని ఉద్ధానం ప్రాంతంలో కిడ్నీ వ్యాధితో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నా రాష్ట్ర ప్రభుత్వం నుంచి సరైన స్పందన రావడం లేదు కాబట్టే జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌ దీక్ష చేపడుతున్నారని ఆ పార్టీ అడ్వైజరీ కమిటీ కన్వీనర్ మాదాసు గంగాధరం హైదరాబాద్‌లో మీడియాకు తెలిపారు.
 
ఉద్ధానం కిడ్నీ బాధితులకి సర్కార్ నుంచి మెరుగైన వైద్య సేవలు అందేవరకు జనసేన పోరాటం చేస్తూనే ఉంటుందన్నారు. ఎలాంటి రాజకీయ ప్రయోజనాలూ ఆశించకుండా మానవతా దృక్పథంతో పవన్ కళ్యాణ్‌ ఈ సమస్యకి పరిష్కారం తీసుకురావాలని సంకల్పించుకున్నారని మాదాసు గంగాధరం తెలిపారు. పవన్‌ దీక్షకు సంఘీభావంగా అన్ని జిల్లా కేంద్రాలు, విజయవాడ నగరంలో జనసేన శ్రేణులు సంఘీభావ దీక్ష చేస్తాయన్నారు. మ‌రి... ఈ దీక్షపై తెలుగుదేశం పార్టీ ఎలా స్పందిస్తుందో చూడాలి.
webdunia

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇల్లాలికి ఇస్త్రీ పెట్టెతో వాత‌లు-పోలీసులు అదుపులో శాడిస్ట్ భ‌ర్త‌..! ఏం జ‌రిగింది?