Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఉల్లిపాయలు వచ్చేస్తున్నాయోచ్... ఎక్కడికి?

ఉల్లిపాయలు వచ్చేస్తున్నాయోచ్... ఎక్కడికి?
, మంగళవారం, 24 డిశెంబరు 2019 (22:00 IST)
న్యూఢిల్లీ : దేశంలో ఉల్లిపాయల కొరతను తీర్చేందుకు కేంద్ర ప్రభుత్వం విదేశాల నుండి దిగుమతి చేసుకుంటోంది. తొలి దశలో 790 టన్నుల ఉల్లిపాయలు ముంబయి చేరుకున్నాయని వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారి సోమవారం తెలిపారు. అందులో కొంత సరుకును ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్‌లకు దిగుమతి ఖర్చు రూ.57/రూ.60గా నిర్ణయించి సరఫరా చేస్తున్నామని చెప్పారు. 
 
టర్కీ, ఈజిప్టు, ఆఫ్గనిస్తాన్‌ల నుంచి ఉల్లిపాయలను దిగుమతి చేసుకుంటున్నామని వెల్లడించారు. ఈ నెలాఖరుకు మరో 12 వేల టన్నుల ఉల్లిపాయలు రావచ్చునని తెలిపారు. ప్రభుత్వం తరుపున మెటల్స్‌ అండ్‌ మినరల్స్‌ ట్రేడింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (ఎంఎంటిసి) 49,500 టన్నుల ఉల్లి దిగుమతికి ఆయా దేశాలతో ఒప్పందం కుదుర్చుకుంది.
 
కేజీ ఉల్లి ధర రూ.100 నుంచి రూ.160కు చేరుకున్న నేపథ్యంలో విదేశాల నుండి దిగుమతి చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఐసిస్: 'ఇరాక్‌లో మళ్లీ బలపడుతున్న మిలిటెంట్లు'