Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఏకాంతం కోసం వస్తే ప్రియుడిని కట్టేసి ప్రియురాలిపై అత్యాచారం.. ఎక్కడ?

ఏకాంతం కోసం వస్తే ప్రియుడిని కట్టేసి ప్రియురాలిపై అత్యాచారం.. ఎక్కడ?
, ఆదివారం, 21 జులై 2019 (10:13 IST)
వారిద్దరూ ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్నారు. త్వరలోనే పెళ్ళి చేసుకోవాలని నిర్ణయించారు కూడా. ఇంతలోనే ప్రియుడు కళ్ళముందే ప్రియురాలు అత్యాచారానికి గురైంది. కొద్దిసేపు ఏకాంతంగా గడిపేందుకు వచ్చిన సమయంలో ఈ దారుణం జరిగింది. ఈ దారుణం ప్రకాశం జిల్లాలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ప్రకాశం జిల్లా చీరాల పట్టణం విఠల్‌ నగర్‌‌కు చెందిన ఓ యువతి (25)కి మూడేళ్ల క్రితం వివాహం కాగా, ప్రస్తుతం భర్త నుంచి విడాకులు పొంది, తల్లిదండ్రుల వద్ద ఉంటోంది. ఆమె ఓ దుకాణంలో పని చేస్తూ వస్తోంది. ఈ క్రమంలో ఓ యువకుడితో పరిచయం ఏర్పడి అది వారిద్దరి మధ్య ప్రేమకు దారితీసింది. 
 
వీరిద్దరూ శుక్రవారం రాత్రి ఏడు గంటల సమయంలో కారంచేడు సమీపంలోని వంతెన వద్దకు వెళ్లి మాట్లాడుకుంటున్నారు. ఆ సమయంలో మరో బైక్‌పై వచ్చిన ముగ్గురు యువకులు వారిని నిర్బంధించారు. వారి సెల్‌ఫోన్, దగ్గరున్న డబ్బు దోచుకున్నారు. 
 
ఆ తర్వాత యువకుడుని ఓ చెట్టుకు కట్టేసి.. యువతిని లాక్కెళ్లి అత్యాచారం చేశారు. ఆ తర్వాత కామాంధులు పారిపోయి. అక్కడ నుంచి ప్రాణాలతో బయటపడిన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసును నమోదు చేశామని, నిందితులను పట్టుకునేందుకు ముగ్గురు ఎస్సైల ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని అధికారులు వెల్లడించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అమర్‌నాథ్ యాత్ర: ఈ హిందూ తీర్థయాత్రకు ముస్లింలే వెన్నెముక