Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తెలుగు రాష్ట్రాల్లో ఎన్ఐఏ సోదాలు

తెలుగు రాష్ట్రాల్లో ఎన్ఐఏ సోదాలు
, గురువారం, 18 నవంబరు 2021 (19:30 IST)
తెలుగు రాష్ట్రాల్లో ఉదయం నుంచి ఎన్ఐఏ సోదాలు కొనసాగుతున్నాయి. ఏకకాలంలో 13 ప్రదేశాల్లో సోదాలు చేశారు. ఇళ్లలో ఉన్న సెల్‌ఫోన్స్‌, పుస్తకాలు, హార్డ్ డిస్క్‌లు, లాప్‌టాప్‌లు స్వాధీనం చేసుకున్నారు.

అల్వాల్, నాగోల్, నారాయణగూడ, బాగ్‌లింగంపల్లిలో సోదాలు కొనసాగుతున్నాయి. బాగ్‌లింగంపల్లి అంబేద్కర్ కాలేజ్ ఎదురుగా ఉన్న అపార్ట్‌మెంట్‌లో సోదాలు చేశారు.

అపార్ట్‌మెంట్‌లో ఓయూ విద్యార్థులు ఉంటున్నారని సమాచారంతో సోదాలు చేసినట్లు తెలుస్తోంది. ఈ సోదాల్లో నిషేధిత సాహిత్య పుస్తకాలు ఉన్నట్లు గుర్తించారు. నారాయణగూడలోని అంబికా టవర్స్‌లో లేడీస్ హాస్టల్‌లోనూ సోదాలు చేశారు.

నాగోల్‌లో రవిశర్మ ఇంట్లో కూడా సోదాలు చేశారు. ఆయన మావోయిస్ట్ పార్టీలో కేంద్ర కమిటీ సభ్యుడిగా పనిచేసి లొంగిపోయారు. ప్రకాశం జిల్లా ఆలకూరపాడులో విరసం నేత కల్యాణ్‌రావు ఇంట్లో ఎన్‌ఐఏ సోదాలు కొనసాగుతున్నాయి.

అల్వాల్ సుభాష్ నగర్‌లో నివాసముంటున్న.. అమరుల బంధుమిత్రుల సంఘం నేత పద్మ కుమారి, భవాని ఇళ్లలో ఎన్‌ఐఏ సోదాలు చేసింది. పద్మను పోలీసులు విచారిస్తుండగా స్పృహ కోల్పోవడంతో ఆస్పత్రికి తరలించారు. ఇంట్లో పుస్తకాలు, వస్తువులను పోలీసులు చిందరవందరగా పడేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రైతులను మోసం చేస్తున్న ప్రభుత్వాలు: రేవంత్‌రెడ్డి