Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

న్యూ డేమోక్రసి దళ కమాండర్ లింగన్న ఎన్కౌంటర్

Advertiesment
New Democracy
, బుధవారం, 31 జులై 2019 (22:38 IST)
న్యూ డెమోక్రసీ పార్టీ అజ్ఞాత దళానికి, పోలీసులకు జరిగిన ఎదురు కాల్పుల్లో న్యూ డెమోక్రసీ దళ కమాండర్ మృతి చెందగా దళానికి సంబంధించిన, ఐదుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్న సంఘటన గుండాల మండలంలో జరిగింది. 
 
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం అలగడ్డ సమీప అడవిలో పంది గుట్టమీద లింగన్న దళం గత మూడు రోజుల నుండి విశ్రాంతి తీసుకుంటోందన్న సమాచారం తెలిసిన పోలీస్ గ్రే హాండ దళాలు గుట్టను చుట్టుముట్టి లింగన్న దళంపై కాల్పులు జరపడంతో లింగన్న మృతి చెందాడు. ఐదుగురు సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఇదిలా ఉండగా సంఘటనా స్థలానికి ప్రజలను, మీడియాను వెళ్లకుండా సుమారు రెండు గంటలపాటు అడ్డుకున్నారు. అనంతరం జనం గొడవ చేయగా పోలీసులు వదిలి పెట్టారు. జనమంత గుట్ట పైకి వెళ్లే లోగా గుట్ట వెనుక నుండి మృతదేహాన్ని కిందికి దించి వెళ్లిపోతున్న సమయంలో ప్రజల అడ్డుకోగా లింగన్న మృతదేహాన్ని వదిలిపెట్టి కొంతమంది పోలీసులు వెళ్లిపోయారు.

మరికొంతమంది ఆ మృతదేహాన్ని తీసుకోవడానికి రావడంతో ప్రజలు రాళ్లతో పోలీసులపై దాడి చేయగా కానిస్టేబుల్ గాయాలయ్యాయి. పోలీసులు గాలిలోకి కాల్పులు జరిపి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రతిపక్షాలకు ఏంచెయ్యాలో వాళ్ళకే అర్ధం కావడం లేదు.. కెటిఆర్ ఆగ్రహం