Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

'నేను అడిగినంత ఇవ్వకపోతే నువ్వు అన్నం ఎలా తింటావో చూస్తా'.. తెరాస ఎంపీకి నయీం వార్నింగ్

గ్యాంగ్‌స్టర్ నయీం ఆగడాలు అన్నీఇన్నీకావు. ఆయన హతమైన తర్వాత ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. నయీం జీవించివున్నప్పుడు ఏకంగా తెలంగాణ రాష్ట్ర మంత్రులు, ఎంపీలకే వార్నింగ్ ఇచ్చినట్టు ఇపుడు వెలుగులోకి వస

'నేను అడిగినంత ఇవ్వకపోతే నువ్వు అన్నం ఎలా తింటావో చూస్తా'.. తెరాస ఎంపీకి నయీం వార్నింగ్
, శుక్రవారం, 12 ఆగస్టు 2016 (11:27 IST)
గ్యాంగ్‌స్టర్ నయీం ఆగడాలు అన్నీఇన్నీకావు. ఆయన హతమైన తర్వాత ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. నయీం జీవించివున్నప్పుడు ఏకంగా తెలంగాణ రాష్ట్ర మంత్రులు, ఎంపీలకే వార్నింగ్ ఇచ్చినట్టు ఇపుడు వెలుగులోకి వస్తున్నాయి. ఈ వార్నింగ్‌లే ఆయన ప్రాణాల మీదికి వచ్చాయి. ఫలితంగా పక్కా స్కెచ్ వేసిన తెలంగాణ ప్రభుత్వం.. నాయీం కదలికలపై నిఘా పెట్టి.. ఎన్‌కౌంటర్ పేరుతో హతమార్చింది. తెరాస ఎంపీని, ఓ మంత్రిని నయీం బెదిరించాడు. ఇదే అంశంపై ఉత్తర తెలంగాణాకు చెందిన ఓ మంత్రి ఏకంగా సీఎం కేసీఆర్‌కే ఫిర్యాదు చేశారు.
 
'నయీమ్ ఆగడాలు అన్నీఇన్నీ కాదు. బయట తిరగలేకపోతున్నాం.. మమ్మల్ని సైతం బెదిరిస్తున్నాడు.. రూ.కోట్లకు కోట్లు డిమాండ్ చేస్తున్నాడు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలంటే వాడికి లెక్క లేదు..' అని సీఎం వద్ద ఆ మంత్రి వాపోయారు. అప్పట్నుంచే నయీమ్ ఆగడాలపై పోలీసు యంత్రాంగం ఓ కన్నేసి ఉంచింది. ఇక హైదరాబాద్ పరిసరాల్లోని అధికార పార్టీకి చెందిన ఒక ఎంపీని రూ.25 కోట్లు ఇవ్వాల్సిందిగా నయీమ్ డిమాండ్ చేశాడు. 'ఇవ్వకపోతే నువ్వు అన్నం ఎలా తింటావో చూస్తా..' అని బెదిరించాడు.
 
రాష్ట్రంలో ఉన్నత స్థాయి రాజకీయ సంబంధాలున్న మరో పారిశ్రామికవేత్తను రూ.75 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ఈ రెండు ఘటనలు కూడా అధికార పార్టీ నేతల్లో వణుకు పుట్టించాయి. ఏకంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రముఖ రాజకీయ నేతలనూ నయీమ్ లెక్కచేయలేదు. ఇలా గత రెండేళ్లలో పదుల సంఖ్యలో అధికార పార్టీ ప్రజాప్రతినిధులు నయీమ్ బాధితుల జాబితాలో చేరిపోయారు. నయీమ్ ఆగడాలపై ముఖ్యమంత్రికి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీంతో సీఎం ఆదేశం మేరకు... టీఎస్ పోలీసులు పక్కా స్కెచ్‌తో నయీంను హతమార్చారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పుష్కరాల తొలి రోజు అపశృతి : ఓ కానిస్టేబుల్ జీవితం విషాదాంతం...