Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మనం వేసిన రోడ్లపై దొంగబ్బాయి నడుస్తున్నాడు.. ఏం చేద్దాం: నారా లోకేష్ సెటైర్లు

జనసేన అధినేత పవన్ కల్యాణ్, వైసీపీ చీఫ్ జగన్మోహన్ రెడ్డిపై నారా లోకేష్ విమర్శలు గుప్పించారు. తనపై పవన్, జగన్ చేస్తున్న ఆరోపణలపై నారా లోకేష్ స్పందిస్తూ.. తనపై ఆరోపణలు చేశారు కానీ, ఆధారాలు చూపమంటే మాత్రం

మనం వేసిన రోడ్లపై దొంగబ్బాయి నడుస్తున్నాడు.. ఏం చేద్దాం: నారా లోకేష్ సెటైర్లు
, బుధవారం, 18 జులై 2018 (18:22 IST)
జనసేన అధినేత పవన్ కల్యాణ్, వైసీపీ చీఫ్ జగన్మోహన్ రెడ్డిపై నారా లోకేష్ విమర్శలు గుప్పించారు. తనపై పవన్, జగన్ చేస్తున్న ఆరోపణలపై నారా లోకేష్ స్పందిస్తూ.. తనపై ఆరోపణలు చేశారు కానీ, ఆధారాలు చూపమంటే మాత్రం కనిపించకుండా పోతారని చురకలంటించారు. ఆధారాలతో ముందుకు వస్తే తన తప్పు కూడా తెలుసుకుంటానని నారా లోకేశ్ అన్నారు. 
 
అలాగే పశ్చిమగోదావరి జిల్లాలోని పెనుగొండలో బుధవారం నిర్వహించిన ''గ్రామదర్శిని''లో నారా లోకేష్ మాట్లాడుతూ.. 'మనం వేసిన రోడ్లపై దొంగబ్బాయి నడుస్తున్నాడు' తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తనపై ఎన్నో కేసులున్నా చంద్రబాబును విమర్శిస్తున్నారు. ఏపీకి ప్రత్యేక హోదాపై ప్రధాని మోదీని మాత్రం జగన్ ఎందుకు ప్రశ్నించరని అడిగారు. రాజీనామాలు చేసిన వైసీపీ ఎంపీలు ఎక్కడా కనబడడం లేదని నారా లోకేష్ ఏకిపారేశారు. 
 
ఈ సందర్భంగా ఏపీ అభివృద్ధి గురించి నారా లోకేష్ మాట్లాడారు. ఏపీలో డెబ్బై ఏళ్లలో జరగని అభివృద్ధి నాలుగేళ్లలో జరిగిందని, రాష్ట్రంలో 50 లక్షల మందికి పెన్షన్లు అందజేస్తున్నామని గుర్తు చేశారు. నిరుద్యోగులకు వచ్చేనెల నుంచి వెయ్యి రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తామని లోకేష్ వెల్లడించారు. ఎన్నికల లోపు ప్రతి ఇంటికీ మంచినీరు అందించే ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పుకొచ్చారు. 
 
అమ‌రావ‌తిలో అక్టోబ‌ర్ నాటికి 20 లక్షల స్క్వేర్ ఫీట్ల ఆఫీస్ స్పేస్ సిద్ధమని మంత్రి లోకేష్ తెలిపారు. మంగ‌ళ‌గిరి ఐటిపార్క్‌కు మంచి డిమాండ్ ఉందన్నారు. ఆగ‌స్టు నాటికి రాష్ట్రానికి పెద్ద కంపెనీలు రాబోతున్నాయని, పాలసీ ప్రకారం ప్రతిష్టాత్మక కంపెనీలకు భూములు కేటాయిస్తున్నామని నారా లోకేష్ వ్యాఖ్యానించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పిలిస్తే పలుకలేదని ఫ్రెండ్‌ను చంపేశారు.. ఎక్కడ?