Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నంద్యాల ఫైట్... గెలిచేదెవరు? ఓడేదెవరు? వేణుమాధవ్ ధైర్యమేంటి?(వీడియో)

నంద్యాల ఉప ఎన్నికలో గెలుపు కోసం అటు తెలుగుదేశం పార్టీ ఇటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హోరాహోరీగా తలపడుతున్నాయి. విజయం కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాయి. వైకాపా అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి ప్రచారంలో భాగంగా తెదేపాను తీవ్రస్థాయిలో విమర్శించారు. చంద్రబాబు నా

నంద్యాల ఫైట్... గెలిచేదెవరు? ఓడేదెవరు? వేణుమాధవ్ ధైర్యమేంటి?(వీడియో)
, శనివారం, 19 ఆగస్టు 2017 (16:11 IST)
నంద్యాల ఉప ఎన్నికలో గెలుపు కోసం అటు తెలుగుదేశం పార్టీ ఇటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హోరాహోరీగా తలపడుతున్నాయి. విజయం కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాయి. వైకాపా అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి ప్రచారంలో భాగంగా తెదేపాను తీవ్రస్థాయిలో విమర్శించారు. చంద్రబాబు నాయుడు సర్కారు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని దుయ్యబట్టారు. అలాంటి నాయకుడికి ఉరిశిక్ష వేసినా తప్పులేదంటూ వ్యాఖ్యానించారు. దీనిపై తెదేపా తీవ్రస్థాయిలో మండిపడింది. జగన్ మోహన్ రెడ్డి దిష్టిబొమ్మలను తగులబెట్టింది. మరోవైపు తెదేపాకు మద్దతు ఇచ్చే విషయంలో పవన్ కళ్యాణ్ వెనుకడుగు వేశారు. ఈ పరిణామం తెదేపాకు కాస్త దెబ్బ కొట్టినట్లే అయ్యింది. 
 
ఇంకోవైపు భూమా దంపతుల సెంటిమెంట్ వర్కవుటవుతుందని భావిస్తున్నారు. తెదేపాకు పవర్ స్టార్ పర్యటన లేకపోయినప్పటికీ హాస్య నటుడు వేణు మాధవ్ రంగంలోకి దిగి పార్టీ తరపున ప్రచారం చేస్తున్నారు. ఎమ్మెల్యే రోజాపై సెటైర్లు వేస్తున్నారు. తెదేపా అభ్యర్థి గెలుపు నిర్ణయం అయిపోయిందనీ, మెజారిటీ ఎంత అనే దానిపైనే తాము ఆలోచన చేస్తున్నామంటూ చెప్పుకొచ్చారు. మరి వేణు మాధవ్ ధైర్యమేంటో తెలియడంలేదు. ఇకపోతే నంద్యాలలో ఈ నెల 23న జరిగే ఎన్నికతో ఎవరి గెలుపో తేలిపోనుంది. వీక్లీ రౌండప్ కోసం ఈ వీడియో చూడండి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

టీడీపీ కార్పొరేటర్ ఇంట్లో వ్యభిచారం... విజయవాడలోనే...