Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ప్రత్యేక హోదాపై ఎద్దేవా చేస్తారా? మోదీగారూ తీరు మార్చుకోండి..

ఏపీకి ప్రత్యేక హోదా గురించి అడిగితే రక్షణ రంగం నుంచి నిధులు ఇవ్వాలా? అని ఎద్దేవా చేసిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

ప్రత్యేక హోదాపై ఎద్దేవా చేస్తారా? మోదీగారూ తీరు మార్చుకోండి..
, ఆదివారం, 7 అక్టోబరు 2018 (11:05 IST)
ఏపీకి ప్రత్యేక హోదా గురించి అడిగితే రక్షణ రంగం నుంచి నిధులు ఇవ్వాలా? అని ఎద్దేవా చేసిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రత్యేక హోదా గురించి అలా మాట్లాడిన ప్రధాని దేశ రక్షణకు అంత్యంత కీలకమైన అంశాలపై నోరెందుకు మెదపడం లేదని ప్రశ్నించారు. అంతేకాదు.. రాఫెల్ డీల్‌పై ఎందుకు పెదవి విప్పడం లేదని నిలదీశారు. 
 
స్వచ్ఛ భారత్ పేరుతో తెరవెనుక బ్యాంకులను ఊడ్చేస్తున్నారని ఆరోపించారు. జీఎస్టీ అమలుతో నష్టపోయిన చిరు వ్యాపారులను ఆదుకోవాలని రామ్మోహన్ నాయుడు డిమాండ్ చేశారు. మోదీ తీరు చూస్తుంటే.. ఆయన కార్పొరేట్ సంస్థలకే తప్ప దేశానికి ప్రధాని కాదన్న విషయం అర్థమవుతోందన్నారు. బ్యాంకులకు వేల కోట్ల రూపాయల రుణాలు ఎగ్గొట్టిన వారిని సురక్షితంగా దేశం దాటిస్తున్నారని ఆరోపించారు. ఇకనైనా మోదీ మౌనం వీడాలని కోరారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ముందస్తు ఎన్నికలు.. అమావాస్య రోజు.. కేసీఆర్‌కు కలిసొస్తుందా?